Publish Date:Apr 28, 2022
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారు. రెండు రోజులు హస్తినలోనే మకాం వేస్తారు. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతారు. ఇంత వరకూ బానే ఉంది.. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హరిచందర్ బిశ్వభూషన్ హస్తిన పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే జగన్ హస్తిన పర్యటనకు బయలు దేరడం ప్రాధాన్యత సంతరించుకుంద. అది కూడా గవర్నర్ తో గురువారం భేటీ అయ్యి, ఆ వెంటనే శుక్రమారం ఢిల్లీ విమానం ఎక్కనుండటంతో ఏం జరగనున్నది అన్న ఉత్కంఠ నెలకొంది.
ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషన్ మూడు రోజుల హస్తిన పర్యటన ముగించుకుని ఈ రోజే తిరిగి వచ్చారు. కేంద్రం ఆయనను హస్తినకు పిలిపించుకుందని సమాచారం. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సహా పలువురు కీలక మంత్రులు, అధికారులతో వరుస బేటీలతో బిజీబిజీగా గడిపారు.
ఆయన హస్తిన నుంచి తిరిగి వచ్చిన వెంటనే జగన్ ఆయనతో బేటీ అయ్యారు. గవర్నర్ తన హస్తిన పర్యటనలో భాగంగా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నివేదికలు సమర్పించినట్లు సమాచారం.
దీంతో గవర్నర్ కేంద్రానికి ఇచ్చిన నివేదికలు ఏమిటి? ఆ నివేదికల ఆధారంగా కేంద్రం ఏం చర్యలు తీసుకోనున్నది? ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఏం చర్యలకు ఉపక్రమించనున్నది అన్నది ఉత్కంఠగా మారింది.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ హడావుడిగా గవర్నర్ తో భేటీ కావడం, ఆ వెంటనే హస్తిన బయలుదేరడానికి షెడ్యూల్ ఖరారు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ఆర్థిక అవకతవకలపై కేంద్రం సీరియస్ గా ధృష్టి పెట్టిందన్న పరిశీలకుల విశ్లేషణలకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.
ఏపీ ఆర్థిక అవకతవకలపై కేంద్రం సీరియస్ గా ఉందనీ, స్వయంగా గవర్నర్ పూచీకత్తుపైనే ఏపీ పాతిక వేల కోట్లు అప్పు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ హస్తిన పర్యటన, ఆ వెంటనే జగన్ ఢిల్లీ పయనం రాజకీయ వర్గాలలో పలు రకాల చర్చలకు తెర లేపాయి. గవర్నర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కేంద్రం పెద్దలతో వరుస భేటీలతో బిజీబిజీగా గడపడంతో ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం చర్యలకు ఉపక్రమించేందుకు దాదాపుగా సిద్ధమైందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే జగన్ ను హుటాహుటిన హస్తినకు పిలిపించారన్న అనుమానాలూ వ్యక్త మౌతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-to-ddelhi-after-governer-return-what-is-happening-in-delhi-39-135122.html
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.