అన్నిటికీ ఇంకా సజ్జలేనా అన్నది ప్రెజంట్ వైసీపీ అభిమానుల మాట. అప్పుడంటే ఆల్ డిపార్ట్ మెంట్స్ హోల్ సేల్ మినిస్టర్ గా సజ్జల పెద్ద ఎత్తున ఒక వెలుగు వెలుగొందిన విషయం అంతటా తెలిసిందే. గత జగన్న పాలనలో ఇటు ధనుంజయ్ రెడ్డి, అటు సజ్జల.. ఈ ఇద్దరి హవా నడిచిందని అంటారు. మరీ ముఖ్యంగా సజ్జల అయితే వైయస్ జగన్ తలరాత తిరగరాసినట్టుగా భావిస్తారు. అసలు సజ్జల వల్లే జగన్ కి చాలా విషయాలు చేరక పోయేవని చెబుతారు. దీంతో జగన్ ఒకానొక పబ్జీ గాడాంధకారంలో పడి కొట్టుమిట్టాడినట్టుగా ఒక అంచనా.
అలాంటి సజ్జలను తొలగించాలంటూ పార్టీ ఓడినప్పటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా సరే సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను అలాగే అంటి పెట్టుకుని కూర్చున్నారు జగన్. ఇకనైనా వీరిని మార్చాల్సిన అవసరముందని అంటున్నారు. ప్రస్తుతానికైతే భార్గవ్ నుంచి సోషల్ మీడియాను లాగేసుకుని.. ఆపై మరొకరికి దాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. కానీ సజ్జలే మళ్లీ తన పాత పాత్రను అలాగే నిలుపుకుని.. ఇంకా మీడియా ముందుకొచ్చి జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.
ఏమాటకామాట విజయసాయి రెడ్డి కలసి వచ్చినట్టు సజ్జల జగన్ కి కలసి రాలేదని అంటారు చాలా మంది జగన్ అభిమానులు. ఈయనకు ఏదీ నడపటం సరిగా రాదు. పైపెచ్చు మీడియా నుంచి వచ్చినట్టు చెప్పుకు తిరుగుతారు కానీ, మీడియా మేనేజ్మెంట్లో కనీసం ఏబీసీడీలు తెలీవని వాపోతారు. అంతెందుకూ.. తనపై రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినపుడు.. కొన్ని చానెళ్లలో తనపై జరిగిన డిబేట్లకు జడుసుకుని.. నేనేమైనా దేశ ద్రోహినా అంటూ మొహం వేలాడేశారు.
తనకు తాను రక్షించుకోలేని వాడు.. జగన్ ని మాత్రం ఏం రక్షించగలడు? ఈ విషయం ఎందుకో జగన్ కి ఇంకా అర్ధం కావడం లేదు. అప్పట్లో విజయసాయి రెడ్డి అంత రేంజ్ లో సజ్జల జగన్ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని అంటారు. నిజానికి విజయసాయి రెడ్డి జగన్ ఆస్తుల, ఆర్ధిక లావాదేవీలను ఇంకా చక్కబెడుతున్నట్టుగానే చెబుతారు. ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారుగానీ జగన్ ఫైనాన్షియల్ వ్యవహారాల నిర్వహణ నుంచి బయటకు రాలేదని సమాచారం.
ఇదలా ఉంచితే, పార్టీకి సరిగ్గా అలాంటి వ్యక్తి అవసరముంది కానీ, సజ్జల లాంటి వారు కాదన్నది ఫ్యాన్ పార్టీ శ్రేణులు బాహటంగా అంటోన్న మాట. మరి సజ్జల కాకుండా ఇంకెవరున్నారు. అన్న చర్చ కూడా నడుస్తోంది. బేసిగ్గా వైసీపీ అన్యులను అంత తేలిగ్గా ఎంటర్ టైన్ చేయదు. దీంతో సజ్జలకు ఇంకా ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోందని భావిస్తున్నారు. సజ్జల ఫేస్ చూసి చూసి జనానికి బోర్ కొట్టేసిందని.. ఆయన వాక్య నిర్మాణం కూడా ఏమంత బాగుండదని.. అంత రసవత్తరంగా కూడా ఆయన మాట్లాడలేడు కాబట్టి మాకు నీరసం వస్తోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-should-change-brand-sajjala-39-205639.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.