జగన్.. బీజేపీ రహస్య మైత్రి ఇంకా కొనసాగుతోందా?

Publish Date:Nov 25, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించారు. జగన్, బీజేపీల రహస్య మైత్రి అప్పట్లో ప్రతి సందర్భంలోనూ వెలుగులోకి వచ్చింది. జగన్ అరాచకాలను, అస్తవ్యస్త విధానాలనూ అప్పట్లో బీజేపీ అన్ని విధాలుగా సమర్ధించింది. సహకరించింది. ప్రోత్సహించింది. సరే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ అధినాయకత్వం తన వైఖరి మార్చుకుని జగన్ తో దూరం పాటిస్తోందని ఇంత కాలం, అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అందరూ భావించారు.

అందుకు తగ్గట్టుగానే ఏపీలో బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ అరెస్టునకు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో జగన్ కూడా బీజేపీపై, కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కాంగ్రెస్ కూటమికి చేరువ అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇతంతా ఉత్తిదేననీ, జగన్, బీజేపీల మధ్య మైత్రి దృఢంగా కొనసాగుతోందనీ తాజాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. తాజాగా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చేసిన దిశానిర్దేశాన్ని చూపుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ మద్దతు ఇవ్వాలని ఎంపీలకు సూచించారని ఆ పార్టీ నేతలే చెప్పడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. 

సోమవారం (నవంబర్ 25) నుంచి వచ్చే నెల 20 వరకూ జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు మరీ ముఖ్యంగా బీజేపీకి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అద్భుత విజయం ఆ పార్టీకి ఇచ్చిన ఉత్సాహంతో మోడీ, షాలు అజెండాలో లేకున్నా ఈ సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిన్లును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఈ బిల్లే కాకుండా విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ఆమోదింప చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ ఆమోదం తెలపాలని జగన్ తన ఎంపీలకు సూచించారంటే.. బీజేపీతో ఆయన రహస్య మైత్రీ ఇంకా కొనసాగుతోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని చెబుతున్నారు.  

లోక్ సభలో వైసీపీ మద్దతు, వ్యతిరేకతతో బీజేపీకి పెద్ద పట్టింపు ఉండదు కానీ, రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నిలిస్తే ఆ పార్టీని ఒకింత ఇరుకున పెట్టే అవకాశం వైసీపీకి ఉంటుంది. అయితే ఆ మాత్రంగా కూడా బీజేపీకి ఇబ్బంది కలిగించేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖంగా లేరు. అలా వ్యతిరేకిస్తే అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుని జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురౌతుందని జగన్ ఇప్పటికీ భయపడుతున్నారు. అందుకే  బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ఆయన ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారు. బీజేపీని తాను వ్యతిరేకించకుంటే.. తనపై కేసుల విషయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం సహకారం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి బీజేపీ ఏం చేస్తుందో?

By
en-us Political News

  
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.