తాడేపల్లి ప్యాలెస్ లో జగన్.. జిల్లా పర్యటనల ఊసేదీ?

Publish Date:Feb 4, 2025

Advertisement

రెండు వారాల విదేశీ పర్యటన అనంతరం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ కు రాలేదు. బెంగళూరు ప్యాలెస్ లో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని సోమవారం(ఫిబ్రవరి 3) ఏపీలో ఎంటరయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత ఆయన తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. అక్కడ కూడా కొద్ది సేపు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.  

ఆయన ఏపీలో అడుగు పెట్టిన తరువాత ఇక పార్టీ కార్యక్రమాలు జోరందుకుంటాయనీ, తమ అధినేత ప్రజలలోకి వస్తారనీ ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అసలు పార్టీ వ్యవహారాల ఊసే లేకపోవడం చూస్తుంటే.. ఆయన ఏపీ పర్యటన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అన్నట్లుగా ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ముందుగా నిర్ణయించిన మేరకు ఆయన జిల్లాల పర్యటన చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూశాయి. అయితే జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఇక ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఫీజు పోరు నిరసన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో గడపడం వినా ఎటువంటి కార్యక్రమాలనూ చేపట్టరన్నది రూఢీ అయిపోయింది.  

గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడిచిపోయింది. ఈ ఎనిమిది నెలల కాలంలో వైసీపీ అధినేతగా జగన్ ఓటమిపై సమీక్ష నిర్వహించడం కానీ, ఓటమితో నిరాశ చెందిన నేతలు, క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి చేసిన ప్రయత్నం కానీ లేదు. అసలు ఆయన ఈ ఎనిమిది నెలల కాలంలో ఏపీలో ఉన్నదే తక్కువ. ఆ ఉన్న తక్కువ సమయంలో కూడా అత్యధిక సమయం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించ లేదు.  

అసలు వైసీపీ ఓటమి తరువాత ఒక రాజకీయ పార్టీలా వ్యవహరించిన సందర్భమే లేదు. 2014లో వైసీపీ పరాజయం పాలై ప్రతిపక్షానికే పరిమితమైన సమయంలో జగన్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసి కనిపించింది. దాంతో ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఆయన సుందరముదనష్ట పాలనను జనం చూశారు. సో ఇప్పుడు ఆయన మాటలను విశ్వసించడానికి కానీ, వినడానికి కానీ వారు సిద్ధంగా లేరు. ఆ కారణంగానే జగన్  జిల్లాల పర్యటనకు పార్టీ నేతలే ఉత్సాహం చూపలేదు. ఏర్పాట్లు చేయలేమనీ, జనాలను తరలించలేమనీ చేతులెత్తేశారు. దీంతో జనంలోకి వెళ్లి భంగపడటం కంటే.. ప్రెస్ మీట్లకు పరిమితమై నిరసన వ్యక్తం చేయడమే మేలన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. 

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.