ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం
ఈ నెల 5న(బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ప్రచార పర్వం నిన్నటితో ముగియడంతో పోలింగ్ మిగిలింది. ఆప్, ప్రతిపక్ష బిజెపి మధ్య హోరా హోరి పోరు జరుగనుంది. ఎన్నికల ప్రచార అంశాల్లో కాలుష్యం, తాగునీటి సమస్య ప్రధాన అంశాలుగా చేరాయి. యమునా నది కాలుష్యం ఎన్నికల ప్రచారం అస్త్రంగా నిలిచింది. ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. బుధవారం జరుగనున్న పోలింగ్ లో కోటి 56 లక్షల మంది ఓటేయనున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ మూడోసారి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటే 25 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న బిజెపి అధికారంలో రావాలని చూస్తుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ ఉనికి కోసం తహతహలాడుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొన్నారు. మేనిఫెస్టోను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో అగ్రనేతలు మల్లి ఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాందీలు ఢిల్లీ చుట్టేశారు. బిజెపి తరపున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలుగువారందరూ బిజెపికే వోటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ నేతృత్వంలో భారత దేశం వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. బడ్జెట్ లో టెక్నాలజీ, వ్యవసాయరంగాలకు ప్రోత్సహించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఫిబ్రవరి 8న ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/everything-is-ready-for-polling-of-delhi-assembly-elections-39-192353.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!