Publish Date:Feb 17, 2025
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కీలక నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ, ఏసీబీలు విచారించాయి. అవసరమైతే మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పాయి. అలాగే ఇదే కేసులో సీసియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ, ఏసీబీలు విచారించాయి. ఆ తరువాత కొద్ది రోజుల పాటు ఈ కేసులో ఎటువంటి పురోగతీ కనిపించలేదు.
అయితే ఇప్పడు మళ్లీ ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. ఈ కేసులో సొమ్ములు అందుకున్నట్లు చెబుతున్న ఒక విదేశీ సంస్థకు ఏసీబీ నోటీసులు పంపింది. ఎఫ్ ఈఓకు పంపిన నోటీసులలో వర్చువల్ గా విచారణకు రావాలని ఆదేశించింది. ఏసీబీ నోటీసుల మేరకు ఎఫ్ఈవో సంస్థ సీఈవో సోమవారం (ఫిబ్రవరి 17)న వర్చువల్ గా ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏసీబీ ఎఫ్ఈవో సీఈవో ఆల్బర్టోను సుదీర్ఘంగా విచారించింది. పలు కీలక అంశాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు గుప్పించారు. ఫార్ములా ఈ-కార్ రేసు సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపై అల్బర్టోను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-questions-feo-ceo-albarto-39-193029.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు