Publish Date:Jul 30, 2025
జగన్ ప్రెస్ మీట్లకు.. ఈ మధ్య రాముడు మంచి బాలుడికి మల్లే వచ్చేస్తున్నారు. భల్లే భల్లే కబుర్లు చెబుతున్నారు. అంతా బాగుంది. ఆయన కబుర్లన్నీ పేపర్లూ, టీవీల్లో వచ్చేస్తాయి. కాదనడం లేదు. కానీ ఈ బొట్టు పెట్టుకుని మరీ బుద్ధిమంతుడ్లా కనిపించడమేంటా? అన్నది ఒక అనుమానం. ప్రశ్న. చర్చ. వగైరా వగైరా.
జగన్ కి ఎల్వీ సుబ్రహ్మణ్యం దగ్గర తగిలింది హిందూత్వ దెబ్బ. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఆయన హిందూ ఆలయాల్లో అన్యమతస్తులను తీసి వేస్తూ జీవో తేబోతే క్రిష్టియన్ సంఘాలు వద్దని వారించడం.. ఎల్వీ వినక పోవడం.. దీంతో ఆయన్ను జీఏడీకి అటాచ్ చేయడంతో స్టార్టయ్యింది జగన్ క్రిష్టియన్ సీఎం అనే ముద్ర పడడం. దీంతో ఎల్వీ సైతం తప్పుకోవడంతో క్రిష్టియన్ సంఘాలు కేక్ కట్ చేసుకుని సంబురాలు చేసుకున్నాయి. గానీ అది జగన్ పార్టీకి ఆశనిపాశంగా మారినట్టు అంచనా వేస్తారు.
దీంతో ఈ ముద్ర చెరుపుకోడానికి తన ఆస్థాన స్వామి స్వరూపానందేంద్ర చేత యజ్ఞ యాగాదులు చేయించారు. ఆపై ఎన్నెన్నో ఇతరత్రా హిందూ క్రతువులు చేయించారు. కానీ ఆ మరక ఆయన్ను మాత్రం వీడిపోలేదు. ఇక లాభం లేదని లాస్ట్ స్టేజ్ లో ఇంట్లో సెట్ వేసి.. తన భార్య చేత ప్రసాదం పేపర్లో చుట్టించారు. అయినా జనం నమ్మలేదు.
ఫైనల్ గా జగన్ ఒక క్రిష్టియన్ సీఎం అని బ్రాహ్మణ- వైశ్య- క్షత్రియ, కమ్మ.. వారితో పాటు సాటి రెడ్డి కులస్తులు సైతం నమ్మారు. కట్ చేస్తే హిందూ వర్గాల్లో చాలా వరకూ ఇదే నిజమని భావించి.. ఆయన పుట్టి నిండా ముంచారు. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.
ఇప్పుడు చూస్తే ఎలాగైనా సరే ప్రో హిందూగా ఒక కలరింగ్ ఇవ్వడానికా అన్నట్టు.. ఈ ఉండమ్మ బొట్టు పెడతా నాటకానికి తెరలేపినట్టున్నారు చూస్తుంటే. అందుకే ఇదంతా అన్న చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను మిస్టర్ హిందూ ప్రో మ్యాన్ అనిపించుకోడానికి ఇంకెన్ని వేషాలు వేస్తారో అన్నియ్య అన్న టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-new-look-with-sindoor-on-fore-head-25-203077.html
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.