జ‌గ‌న్ + భ‌జ‌న‌ - పార్టీ = ?

Publish Date:Nov 6, 2025

Advertisement

జ‌గ‌న్ ప్ల‌స్ భ‌జ‌న మైన‌స్ పార్టీ.. ఇదీ నెల్లూరు మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ సారాంశం. జ‌గ‌న్ చుట్టూ భ‌జ‌న  ప‌రులు పేరుకుపోయార‌నీ, ఆయ‌న వారి చెప్పుడు మాట‌లు విని నిండా మునిగిపోయార‌నీ, అప్పుడ‌ప్పుడూ ఆయ‌న్ను విమ‌ర్శించి, త‌ప్పు స‌రిదిద్దే వారి మాట‌లు కూడా వినాల‌ని హిత‌వు ప‌లికారు మేక‌పాటి. నిజానికి జ‌గ‌న్ లో అలాంటి మార్పు వ‌చ్చే అవ‌కాశ‌ముందా? అని చూస్తే అందుకు ఆస్కార‌మే లేద‌ని అంటారు ఆయ‌న గురించి బాగా తెలిసిన వారు.

జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోటరీలో కీ ప‌ర్స‌న్ అయిన విజ‌య‌సాయి రెడ్డి ఈ బాధ ప‌డ‌లేక ఆయ‌న్ను విడిచి వెళ్లిపోయారు.   పార్టీకి దూరంగా మ‌స‌లుతున్నారు. ఇక మిగిలింది స‌జ్జ‌ల‌, ధ‌నుంజ‌య‌రెడ్డి త‌దిత‌రులు. జ‌గ‌న్ ది బాగా ఇగో ఉన్న కేరెక్ట‌రైజేష‌న్. ఆయ‌న త‌న‌కు ఏది అనిపిస్తే అది చేయ‌డం ఒక అల‌వాటు. ఊరికే  వచ్చి ఇచ్చే ఉచిత స‌ల‌హాలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ట్టించుకోరు. అది ఆయ‌న ఇగోయిస్టిక్ మైండ్ సెట్ కి సంబంధించిన విష‌యం. ఒక వేళ ఎవ‌రి నుంచైనా స‌ల‌హా తీసుకుంటే.. కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి పీకే వంటి వారిని నియ‌మించుకుని వారి నుంచైనా ఏదైనా స‌ల‌హా సూచ‌న పాటిస్తారేమోగానీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌న క‌న్నా కింది స్థాయి వ్య‌క్తుల మాట‌లు విన‌డం గానీ వారికి  ప్ర‌యారిటీ ఇవ్వ‌డం గానీ ఉండ‌దు. జ‌గ‌న్ ది అంతా వ‌న్ వే. 

త‌న పార్టీలో ఉన్న లీడ‌ర్ల‌ను జ‌గ‌న్ కేవ‌లం పావులుగానే భావిస్తారు. తాను ఎక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెడితే వారక్క‌డి నుంచి  గెలుస్తారంటే  అదంతా త‌న చ‌రిష్మా యేననీ, వారికంటూ సొంత  ప్ర‌తిభా పాట‌వాలుండ‌వనే నమ్ముతారు జగన్. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఒక రాజ‌కీయ చ‌ద‌రంగం ఆడి బొక్క‌బోర్లా ప‌డ్డారు.  

జ‌గ‌న్ కి ఒక మ‌నిషికి విలువ ఇవ్వాల‌న్న విషయం కనీసం తెలియదంటారు ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారు.  ఇదే విషయాన్ని  విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టికే ఎన్నోసార్లు బాహ‌టంగానే చెప్పారు కూడా.  జ‌గ‌న్ తో పోలిస్తే తానెంతో సీనియ‌ర్ అయినా.. నిల‌బ‌డే మాట్లాడాల్సి ఉంటుంద‌ని విజయసాయిరెడ్డి చెప్పుకోవడమూ  తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను కూడా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ గౌర‌వించిన దాఖలాలు లేవు. ఈ విష‌యంలో ర‌ఘురామ మ‌రింత క్లారిటీగా చెప్ప‌గ‌ల‌రు. ఆయ‌నంతగా జ‌గ‌న్ ని వ్య‌తిరేకించారంటే అందుకు కార‌ణం ఈ విలువ‌లేని త‌న‌మే.

సాధార‌ణంగా చిన్న పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్కరికీ వారి వారి  స్తోమ‌త‌కు త‌గ్గ‌ట్టు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. కొన్ని సార్లు ఆ విష‌య ప‌రిజ్ఞానం ఎన్నో వింత‌లను న‌మోదు చేస్తుంద‌ని న‌మ్మే ర‌కం కాదు జ‌గ‌న్ రెడ్డి. ఆయ‌నదంతా త‌న తాత స్టైల్. వీడ్ని కొట్టు- వాడ్ని ప‌ట్టు- ఇదిగో వీడికి పెట్టు. అనుకుంటారు త‌ప్ప‌.. మ‌న‌క‌న్నా మించి మ‌న‌కు తెలివితేట‌లు నేర్పేవారు మ‌న కింది స్థాయి  వ్య‌క్తుల్లో ఉంటార‌న్న న‌మ్మ‌కాలు గానీ, అభిప్రాయాలు గానీ జ‌గ‌న్ లో ఉండ‌వు. ఉండ‌బోవు. 

ఆయ‌న‌దంతా ఒక‌టే సిద్ధాంతం. పైన దేవుడున్నాడు. కింద  జ‌నం ఉన్నారు. మ‌ధ్య‌లో మ‌నం  ఈ ఇద్ద‌రి ద్వారా ఇక్క‌డ చ‌క్రం తిప్పుతుంటాం అనుకునే బాప‌తు. ఒక వేళ మేక‌పాటి చెప్పిన‌ట్టు ఎవ‌రైనా ఒక‌రు చెప్పిన స‌ల‌హా సూచ‌న‌ల కార‌ణంగా ఏదైనా పార్టీకి ల‌బ్ధి చేకూరిందే అనుకుంటే.. జ‌గ‌న్ లోని ఇగో దాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు. 

జ‌గ‌న్ ఫీలింగ్స్ లో ఇది జ‌నం  కోసం పార్టీ పెట్టిన  పార్టీ అని గానీ వారికి ల‌బ్ధి చేకూరాల‌ని పెట్టిన పార్టీ అనిగానీ భావించరు. త‌న తండ్రి మీద‌నే ఒక ఈర్ష్య, అసూయ క‌లిగిన  వ్య‌క్తి జ‌గ‌న్. ఈ విష‌యం  ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. తాను ఓదార్పు యాత్ర‌ల‌కు వెళ్లిన‌పుడు త‌న తండ్రి  ఫోటో వారిళ్ల‌లో దేవుడి ఫోటోల ప‌క్క‌న  పెట్టార‌నీ.. ఆ స్థానంలో త‌న ఫోటో ఉండాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌గాఢ‌మైన‌ కోరిక‌.  అందుకోసం తాను అధికారంలో ఉండగా ఎడా పెడా, ఇబ్బ‌డి ముబ్బ‌డిగా జ‌నానికి రాష్ట్ర ఖ‌జానా  సొమ్ము దోచి పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనుకాడలేదు జగన్. 

అదే సొమ్ము రాష్ట్రం చెంత ఉంటే, దాంతో ఈ పాటికి అమ‌రావ‌తి రాజ‌ధానితో పాటు పోల‌వ‌రం కూడా పూర్త‌య్యి ఉండేది.  అలాంటి జగన్ ఇప్పుడు  కార్య‌క‌ర్త‌ల కోసం తాను మారుతున్న‌ట్టు చెబుతున్నా.. జ‌గ‌న్ కున్న మాన‌సిక స్థితిని బ‌ట్టి చూస్తే అందులోనూ వ‌న్ వే యేఉంటుంది త‌ప్ప‌, ప్ర‌జాస్వామిక విధాన  స‌ర‌ళిని  ఊహించ‌డం వెర్రిత‌న‌మే అవుతుందంటున్నారు పరిశీలకులు.  అటువంటి జగన్ కనుక రాష్ట్రానికి మరో సారి సీఎం అయితే.. ఏపీని ఆయ‌న నామ‌రూపాల్లేకుండా చేస్తార‌న‌డంలో సందేహానికి తావులేదం టున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.