కాంగ్రెస్ తెదేపాల ఆరోపణలు ద్రువీకరిస్తున్న వైకాపా

Publish Date:Apr 17, 2013

Advertisement

 

జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలుని తన పార్టీ కార్యాలయంలా మార్చుకొని అక్కడి నుండే పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వంతపాడటం మొదలుపెట్టాక, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు మరో అడుగు ముందుకు వేసి జగన్ మోహన్ రెడ్డిని వేరే రాష్ట్రంలో వేరే జైలుకు తరలించాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ ఉలిక్కిపడింది.

 

అయితే, అప్పుడు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు, కాంగ్రెస్, తెదేపాలు చేస్తున్న ఆరోపణలు ఖండించకపోగా, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి రాజకీయాలు చేస్తే తప్పేమేటి? అలా చేయకూడదని ఏ చట్టం చెపుతోందని ఎదురు ప్రశ్నించారు. తద్వారా కాంగ్రెస్ తెదేపాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయనే అంగీకరించినట్లయింది. ఆయన నాలిక కరుచుకొన్నపటికీ అప్పటికే జరగవలసిన అనర్ధం కాస్తా జరిగిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు తెదేపా చేస్తున్నఆరోపణలను దృవీకరించినట్లయింది.

 

దానితో ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి ఈ ఆరోపణలలో నిజానిజాలు నిర్ధారించేందుకు వెంటనే విచారణ చేప్పట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డిని కోరడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయింది.

 

ఇప్పుడు గట్టిగా ఎదురు నిలబడి మాట్లాడకపోతే క్రమంగా ఈ వ్యవహారం ముదిరి చివరికి కోర్టు జగన్ మోహన్ రెడ్డిని నిజంగానే వేరే రాష్ట్రంలో వేరే జైలుకి తరలించమని ఆదేశిస్తే, ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమ పార్టీకి, అది మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని తీవ్ర ఆందోళన చెందిన వైకాపా ఈ సమస్యనుండి బయటపడేందుకు ఇప్పుడు ‘జగన్ కి వ్యతిరేఖంగా కాంగ్రెస్ తెదేపాలు కుట్ర’ అనే కొత్త పల్లవి అందుకొంది. ఆ రెండు పార్టీలు కలిసి తమ అధినేతను తమకి దూరం చేసి, అతనిని జైలుకే పరిమితం చేయాలని దురాలోచనతోనే జగన్నిఏ తీహార్ జైలుకో పంపేందుకు కుట్ర పన్నుతున్నాయని వైకాపా ఆరోపణలు మొదలుపెట్టింది.

 

జగన్ మోహన్ రెడ్డి భార్య శ్రీమతి భారతి కూడా తన భర్తను దర్యాప్తు పేరిట ఇంకా ఎంతకాలం జైల్లో పెడతారు? అదే చంద్రబాబో, కిరణ్‌ కుమారో లోపల ఉంటే, అప్పుడు ఇలాగే తమ భార్యాబిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి అంటే వాళ్లు, వాళ్ల వెనకున్న పార్టీలు ఊరుకుంటాయా? అంటూ ఆమె ఒక ధర్మ సందేహం లేవనెత్తారు మంత్రులకో న్యాయం, చంద్రబాబుగారికో న్యాయం, జగన్ గారికి మాత్రం వేరే న్యాయం.. ఇదెక్కడి న్యాయం అని ఆమె ప్రశ్నించారు.

 

ఒక మహిళగా ఆమె తన భర్త పరిస్థితికి ఆవిధంగా ఆవేదన చెందడం సహజమే. కానీ, తన భర్తలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా జైలు వెళ్ళవలసివస్తే, ఇదే విదమయిన ఇబ్బందులు ఎదుర్కొనవలసివస్తే అని ఊహాజనితమయిన ఆలోచనలతో ఒక వితండవాదన చేయడం చాలా విడ్డూరం. అమాయకుడయిన తన భర్తకి వ్యతిరేఖంగా వారిరువురూ కలిసి కుట్ర పన్నుతున్నారని, అందువల్లనే జగన్ జైలు నుండి విడుదలకాలేకపోతున్నాడని ఆమె గనుక దృడంగా నమ్ముతుంటే, అదే విషయంపై ఆమె న్యాయపోరాటం చేయవచ్చును.

 

ఒక పేదవాడికి అన్యాయం జరిగితే కోర్టుకి మొరపెట్టుకోవడానికి వీలుపడదేమో కానీ, జగన్ మోహన్ రెడ్డి వంటి కొట్లాదిపతికి జరుగుతున్నఅన్యాయాన్ని ప్రశ్నించేందుకు హేమా హేమీలవంటి లాయర్లను నియమించుకొని న్యాయపోరాటం చేయడం కష్టం కాదు. కానీ అతను, అతని కుటుంబ సభ్యులు, అతని పార్టీ నేతలు ఎవరూ కూడా ఆ పనిచేయకుండా కాంగ్రెస్ తెదేపాలు నిందిస్తూ కాలక్షేపం ఎందుకు చేస్తున్నట్లు? మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకనా? జగన్ మోహన్ రెడ్డి అమాయకుడని గ్రామీణ ప్రజలకు నచ్చజెప్పినట్లు దేశంలో ఏ కోర్టుకి నచ్చచెప్పడం కుదరదనే గ్రహింపు వలననా? లేక వేరే చెప్పలేని కారణాల వలననా? వారే చెప్పాలి.

 

ఇక శ్రీమతి భారతి కూడా ‘భార్యాబిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి’ అనే అంశంపై మాట్లాడిన మాటలు, చెపుతున్న అభ్యంతరాలు కాంగ్రెస్, తెదేపాల ఆరోపణలకే బలం చేకూర్చేవిదంగానే ఉన్నాయి. తద్వారా జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి రాజకీయాలు చేయడం, జైలు నియమ నిబంధనలను ఉల్లంఘించి 8 మంది కంటే చాలా ఎక్కువ మందినే కలుస్తున్నట్లు ఆమె కూడా అంగీకరించినట్లయింది. తద్వారా జైలు సుపరిండేంట్ బీ. సైదయ్య పై తెదేపా చేస్తున్న ఆరోపణలు కూడా అంగీకరించినట్లే అయింది.

 

ఈ విధంగా వైకాపా నేతలే స్వయంగా ఉన్నసమస్యను భూతద్ధంలో కాంగ్రెస్ తెదేపాలకు చూపిస్తున్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ తెదేపాలను నిందిస్తూ కాలక్షేపం చేసేబదులు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తే వెంటనే న్యాయపోరాటం చేయడం మంచిది.

 

అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని దృడంగా భావిస్తే, తమ ఆరోపణలకు సరయిన ఆధారాలుంటే వారిరువురినీ కూడా కోర్టుకీడ్చి అమీతుమీ తేల్చుకోవడం మంచిది. లేకుంటే, జగన్ మోహన్ రెడ్డి కేసుల సంగతిని కోర్టులకి వదిలిపెట్టి, ఎటువంటి రోగాలనయినా, ఎటువంటి క్లిష్ట సమస్యలయినా తన దైవికశక్తులతో చిటికలో మాయం చేసేయగల తమ స్వంత కుటుంబ సభ్యుడయిన బ్రదర అనిల్ కుమార్ ను ఆశ్రయించడం వారి ముందున్న మరో మార్గం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.