సునో మియా! దాల్మియా కా సస్పెన్స్ కహానీ

Publish Date:Apr 18, 2013

Advertisement

 

రామాయణ మహాభారత భాగవతాది గ్రంధాలను యుగాల నుండి పటిస్తున్నా ఎప్పటికప్పుడు సరికొత్తగానే దర్శనమిస్తాయవి. ఆ మహత్ గ్రంధాలకు ఎంతమంది పండితులు ఎన్నిభాష్యాలు చెప్పినా అక్షయ పాత్రలో ఆహరంలా ఇంకా చెప్పవలసినవి మిగిలే ఉంటాయి.

 

ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఎంత చెప్పుకొన్నాఅంతు దొరకని అవినీతి కధ ఒకటుంది. అదే జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల కధ. సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను, సీబీఐ కోర్టు, సుప్రీం కోర్టు, హైకోర్టు, పోలీసులు వగైరా వగైరా శాఖలన్నీకలిసి నెలల తరబడి శ్రమిస్తున్నా కూడా జగన్ మోహన్ రెడ్డి అవినీతి భాగోతం మొదలు ఆఖరు ఎక్కడుందో కనిపెట్టలేక పోతున్నాయి. బహుశః ఈ భాగోతం మొత్తం కనిపెట్టాలంటే మరొక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటుచేసుకోవాలేమో.

 

ఎంతకీ అంతమవ్వని ఈ అద్భుతమయిన ధారావాహికంలో ప్రతీ ఎపిసోడ్ లో ఒక ఆశ్చర్యకరమయిన మలుపు లేదా సన్నివేశం ఉంటుంది. పోతే, రాజమౌళి సినిమాలలో మాదిరిగానే మొత్తం ధారావాహికం అంతా ఫ్లాష్ బాక్ లోనే సాగడం దీని ప్రత్యేకత. కాకపోతే ఈ దారావాహికంలో పునర్జన్మలు ఇంకాలేవు. ఉంటే కధ మరింత రక్తి కట్టేదేమో!

 

ఇక ఈ రోజు ఎపిసోడ్, దాల్మియా సిమెంట్స్ కంపెనీ సీనియర్ అధికారి సంజయ్ మిత్ర (8వ ముద్దాయి), దాల్మియా సిమెంట్స్ కంపెనీ యండీ పునీత్ దాల్మియాను సీబీఐ ప్రశ్నించడం అనే సీన్ తో ఓపెన్ అవుతుంది.

 

సీబీఐ అధికారులకి వారు చెప్పిన వివరాలివి: దాల్మియా కంపెనీలో పనిచేసే కొంత మంది ఉన్నతాధికారుల పేర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు విజయ బ్యాంక్ లలో మొత్తం 26 లాకర్లు తెరువబడ్డాయి. కానీ, ఈ లాకర్లు కంపెనీ సీనియర్ మేనేజర్ నీల్ కమల్ బేరి మరియు బ్యాంక్ మేనేజర్ జాయ్ దీప బసుల జాయింట్ అకౌంట్ గా నిర్వహించాబడేవి. వాటికి ‘జేఆర్’ అనేది కోడ్ వర్డ్.

 

ఈ లాకర్లలలో నిలువచేసిన దాదాపు రూ.100కోట్లు 2008-’09 మద్య డిల్లీ, కోల్ కతా మరియు చెన్నై లలో జగన్ మోహన్ రెడ్డికి చెందిన వివిధ కంపెనీలకు ‘అనధికార కుటుంబ ఖర్చుల పద్దు’ క్రింద పంపబడ్డాయి. అయితే ఈ సొమ్మును ఎవరికి పంపాలి, ఎంత పంపాలి వంటి వివరాలు నిర్ణయించేది మాత్రం కంపెనీ సీనియర్ సలహాదారు భరుణ్ జీ అనే పెద్ద మనిషి. ఆయనకి తప్ప ఇతరులెవరికీ ఈ విషయంలో ప్రశ్నించే అధికారం కానీ, ఈ ఖర్చులకి పద్దు నిర్వహించే అధికారం కానీ లేదు.

 

ఆయన పంపించే ఒక పింక్ రంగు కాగితం మీద ఎంత మొత్తం లాకర్ల నుండి ఎంత తీయాలి, ఎవరికి ఈయాలి? అనే రెండు వివరాలతో బాటు ఒక టోకెన్ నెంబర్ కూడా ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి కంపెనీలకు హవాలా మార్గం ద్వారా అందజేసే నసీం మరియు బాబు అనే వ్యక్తులలో ఎవరో ఒకరు వచ్చి టోకెన్ నెంబర్ అడుగినప్పుడు ఆ నెంబర్ చెపితే వారు అ సొమ్మును చెప్పబడిన అకౌంట్స్ లోకి బదిలీ చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం కంపెనీ సీనియర్ అధికారి నీల్ కమల్ భేరి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగేది.

 

ఈ విధంగా 2011 వరకు కూడా లాకర్లలో సొమ్ము బయటకి వెళ్ళింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక సలహాదారు విజయసాయి రెడ్డి డబ్బుపంపని కోరినప్పుడు, మా మద్య ఉన్న సంబందాలను దృష్టిలో ఉంచుకొని భరుణ్ జీ తో చర్చించిన తరువాత రూ 10-20కోట్లు అయన కంపెనీ ఖాతాలోకి పంపడం అయింది. ఖచ్చితంగా ఆ మొత్తం ఎంత అనే విషయం మాత్రం కేవలం భరుణ్ జీ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఆయనదే తుది నిర్ణయం. మిగిలిన వారందరూ కూడా కేవలం నిమిత్తమాత్రులే.

 

ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమిటంటే ఈ కధలో నిమిత్తమాత్రులయిన పాత్రధారులందరూ ఉన్నారు. కానీ, అసలయిన సూత్రధారి భరుణ్ జీ 2011లో మరణించారు. అదేవిధంగా అంతవరకు నిత్యం ఆఫీసుకి వచ్చిహవాలా ద్వారా కోట్ల రూపాయలను జగన్ చెప్పిన ఖాతలలోకి అవలీలగా పారింపజేసిన నసీం మరియు బాబులు కూడా సీబీఐ జగన్ డొంక లాగడం మొదలుపెట్టగానే అకస్మాత్తుగా కనబడకుండా మాయమయిపోయారు. ప్రస్తుతం వారికోసం సీబీఐ వెతుకుతోంది.

 

ప్రస్తుతం చాలా మంది మంత్రులు సైతం విజయవంతంగా ఆచరిస్తున్నపద్ధతినే మన పాత్రదారులు కూడా అనుసరిస్తూ కనబడని సూత్రధారి మీదకు అంతా నెట్టేసి చేతులు దులుపుకొన్నారు సూత్రదారులు ముగ్గురూ ఎపిసోడ్ చివరిలో అదృశ్యం అవడంతో ఈ సస్పెన్స్ ధారావాహికం సశేషంగా ముగుస్తుంది.

 

ఇంతకీ ఆ నసీం మరియు బాబు ఎలా మయమయిపోయారు? వారిద్దరూ ఎప్పటికయినా దొరుకుతారా? దొరికితే నిజం ఒప్పుకొంటారా? లేకపోతే మరో కొత్త సూత్రధారి పేరు చెప్పి వారు కూడా ఈ దారావాహికాన్ని రక్తి కట్టిస్తారా? వివరాలకు మరో ఎపిసోడ్ వరకు ఎదురుచూడండి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.