జగన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్

Publish Date:May 2, 2013

Advertisement

 

జగన్ మోహన్ రెడ్డి గత 11నెలలుగా జైలులో ఉన్నపటికీ, ఆయన పార్టీ ఇంకా పటిష్టంగా కనబడటానికి ప్రధాన కారణం ఆయన అనుసరిస్తున్న ప్రత్యేక వ్యూహమే కారణమని చెప్పవచ్చును. ఆయన జైలులోకి వెళ్లినప్పటినుండి నేటి వరకు కూడా, ఆయన ఎంచుకొన్న మార్గం ఏమయితేనేమి ఒక పద్ధతి ప్రకారం, ఒక నిర్ణీత వ్యవదుల మద్య వివిధ పార్టీలలో ఉన్నముఖ్య నేతలను తన పార్టీలో చేరేలా చేసుకోవడం ద్వారా పార్టీపై అందరి అంచనాలు ఉన్నతంగా ఉండేలా చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారని చెప్పవచ్చును. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన ఒక తెలివయిన వ్యాపారి (బిజినెస్ మ్యాన్) లక్షణాలు కనబరుస్తూ, తన సంస్థను అసలు కంటే పదింతలు బలమయినదని సమర్ధంగా చూపగలుగుతున్నారు.

 

బహుశః ఈ కారణం చేతనే ఆయనపై ఒకపక్క కోర్టులో తీవ్ర నేరాభియోగాలు మోపబడి కేసులు నడుస్తున్నపటికీ, ఆయన పార్టీకి ఉజ్వలమయిన భవిష్యత్ ఉందని ప్రజలను, విపక్ష నేతలను కూడా గట్టిగా నమ్మించగలుగుతున్నారు. తద్వారా ఇతర పార్టీల నుండి వలసలు కూడా నిత్యం కొనసాగేలా చేసుకోగలుగుతున్నారు. వ్యాపారంలో కొంత మేర డబ్బు సంపాదించిన తరువాత ఆ డబ్బే మళ్ళీ డబ్బును సృష్టించినట్లు వలసలు కొత్త వలసదారులను ప్రోత్సహిస్తున్నాయి.

 

అందుకు ఆయన చేతిలో ఉన్న మూడు బలమయిన ఆయుధాలను చాల తెలివిగా వాడుకొంటున్నారు. అవి 1.సాక్షి మీడియా, 2.తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రతిష్టలు,3.సానుభూతి.

 

రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలం అయిపోయినప్పటికీ నేటికీ ఆయన పట్ల ప్రజలలో సానుభూతిని అదే స్థాయిలో నిలిపేందుకు గతంలో జగన్ తన ‘ఓదార్పుయాత్ర’ చేయగా, ప్రస్తుతం ఆ బాధ్యతను షర్మిల తన ‘మరో ప్రస్థానం’ పాదయాత్రతో, విజయమ్మ తన బహిరంగ సభలు, ఇటీవల ‘రచ్చబండ’ వంటి కార్యక్రమాలతో సమర్ధంగా నిలుపుకొస్తున్నారని చెప్పవచ్చును. వారిరువురూ నిత్యం ప్రజల ముందు ‘రాజన్న రాజ్యం వస్తుందని’ జపించడం అందుకేనని చెప్పవచ్చును.

 

తెరాస తన ఉనికిని కాపాడుకోవడానికి, లేదా ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ‘తెలంగాణా సెంటిమెంటు’ను ఏవిధంగా సమర్ధంగా వాడుకొంటోందో, అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ‘సానుభూతి’ సెంటిమెంటుని నిలుపుకొస్తోందని చెప్పవచ్చును.

 

నిజాయితీగా చెప్పుకోవాలంటే ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు అవినీతి, అసమర్ధత వంటి సమస్యలకంటే సానుభూతి అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది బహిరంగ రహస్యం. దీనిని సరిగ్గా గ్రహించిన ఏ రాజకీయనాయకుడయినా, రాజకీయ పార్టీ అయినా దానిని పూర్తిగా సద్వినియోగపరుచుకొనే ప్రయత్నం తప్పక చేస్తారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదేపని చేస్తున్నారు. అందుకు ఆయన చేతిలో ఉన్న మరో బలమయిన ఆయుధం సాక్షి మీడియాను కూడా ఆయన చాలా సమర్ధంగా ఉపయోగించుకొంటున్నారు.

 

ఆయనే గనుక సాక్షి మీడియాను ఏర్పాటు చేసుకొని ఉండకపోయి ఉంటే, నేడు ఆయన పార్టీ పట్ల ప్రజలలో ఇంత అవగాహన, ఆదరణ ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. నేడు జరుగుతున్న ఈ పరిణామాలన్నిటినీ ఆయన ముందుగానే ఊహించి సాక్షిని ఏర్పాటుచేసుకొన్నాడని చెప్పడం అవివేకమే అవుతుంది, కానీ ఆనాడు ఆయన ఏ కారణాలతో, ఉద్దేశ్యంతో దానిని స్థాపించినప్పటికీ నేడు అదే ఆయనకి శ్రీ రామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చును.

 

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మరే ఇతర రాజకీయ నాయకుడికయినా ఎదురయి ఉంటే ఖచ్చితంగా  అతను రాజకీయాల్లోంచి ఎపుడో కనుమరుగయిపోయి ఉండేవాడు. కానీ జగన్ మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి రాకుండా కాపాడుతున్నది ఆయన సాక్షి పత్రిక మాత్రమేనని చెప్పక తప్పదు. ఆ ఒక్క పత్రిక తప్ప రాష్ట్రంలో, దేశంలో ఆయనకు, ఆయన పార్టీకి అనుకూలంగా వాదిస్తున్న పత్రిక లేదా న్యూస్ చానల్ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అది కూడా లేకపోయుంటే, నేడు ఆయనపై కత్తిగట్టిన యావత్ మీడియా ప్రభావంతో ప్రజలు ఆయనని, ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని ఎన్నడో మరిచిపోయుండేవారేమో కూడా.

 

ఏమయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్నపటికీ, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నపటికీ, ఆయన తన పార్టీపై ప్రజలలో, తన శత్రు పార్టీలలో అంచనాలు పెంచడంలో కృతకృత్యులయ్యారని చెప్పక తప్పదు. ఆయన తన చేతిలో ఉన్న ఈ మూడు ఆయుదాలను అత్యంత సమర్ధంగా వాడుకొంటు తెలివయిన వ్యూహాలతో దూసుకుపోవడమే ఆయన విజయ రహస్యం అనుకొంటే, వైరి పక్షాలలో ఉండే సమస్యలు, ముటాలు, వాటి మద్య తగాదాలు వంటి బలహీనతలు ఆయనకు మరో చక్కటి ఆయుధంగా మారాయని చెప్పవచ్చును.

 

జైలులో ఉంటూ, అనేక కోర్టు కేసులను ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి రచిస్తున్నవ్యూహాలను, బయట ప్రజల మద్య ఉంటూ మీడియా యొక్క అండదండలు కలిగి ఉన్న ఆయన ప్రత్యర్ధులు ఎదుర్కోలేక బెంబేలెత్తిపోవడమే కాకుండా, ఆయన దెబ్బకి తరచూ బోర్లాపడిపోతుండటం సామాన్య ప్రజలకి కూడా నవ్వు తెప్పిస్తోంది. ఇక ఆయన జైలు నుండి విడుదల అయితే ఆయన ధాటికి వారు తట్టుకోగలరా? అనే ఆలోచన కూడా ప్రజలలో తలెత్తడం సహజమే.

 

కాంగ్రెస్, తెదేపాలు రెండూకలిసి కుట్రపన్ని జగన్ మోహన్ రెడ్డిని జైలులో నిర్బందించాయని, షర్మిల, విజయమ్మలు బహుశః అందుకే పదేపదే ఆరోపిస్తున్నారేమో కూడా. ఇక ఇదంతా గమనిస్తే జగన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని అందరు ఒప్పుకోవలసిందే.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.