అమరావతి కంటే జగన్ పోరాటాలే ముఖ్యమా?

Publish Date:Oct 14, 2015

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ నిరాహార దీక్ష చేసారు. ఆరు రోజులకే అది ముగిసిపోయింది. ఆయన ప్రత్యేక హోదా కోసమే దీక్ష చేసినప్పటికీ, ప్రత్యేక హోదా గురించి కంటే ఆయన నిరాహార దీక్ష గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, రాష్ట్రం కోసం ఆయన ఏవిధంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన దాని గురించే సాక్షి మీడియా హైలైట్ చేసి చెప్పుకొంటోంది. చివరికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి ముఖ్యమయిన రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం గురించి ఎక్కడా పొరపాటున కూడా ఒక్క ముక్క పలకకుండా జాగ్రత్తపడుతూ జగన్ దీక్ష, జగన్ ఆరోగ్యం, తెలంగాణాలో బతుకమ్మ పండుగ సంబరాల గురించి మంచి కవరేజ్ ఇస్తోంది.

 

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని పదేపదే చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి మరి అమరావతి శంఖుస్థాపన గురించి ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడటం లేదు? కనీసం ఆయన సాక్షి మీడియా కూడా దానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు? జగన్ దీక్షకి ఉన్నంత ప్రాధాన్యత దానికి లేదా? లేక చంద్రబాబు నాయుడు చేపట్టే ఏ కార్యక్రమాన్నయినా వ్యతిరేకించడమే తన పార్టీ సిద్దాంతంగా మార్చుకొన్న జగన్ అమరావతి శంఖుస్థాపనని కూడా వ్యతిరేకిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

మహాకవి శ్రీశ్రీ లోకం యొక్క బాధను తన బాధగా భావిస్తూ కవితలు వ్రాసేవారు. కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తన బాధనే లోకం యొక్క బాధగా అభివర్ణిస్తూ కవితలు వ్రాసేవారు. జగన్మోహన్ రెడ్డి కూడా కృష్ణశాస్త్రి గారి పద్ధతిలోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ కి ఎంతసేపు తన పార్టీ, తన పోరాటాలు, తన దీక్ష, తన ఆరోగ్యం, తన పదవి లాలస, అన్నీ తనవే...కానీ వాటినే ప్రజల కోసం చేస్తున్న పోరాటాలుగా చెప్పుకొంటూ అందుకు ప్రజల మద్దతు ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సమస్యలన్నిటికీ ఆయన చెపుతున్న ఏకైక పరిష్కారం ఒక్కటే...తను తక్షణమే ముఖ్యమంత్రి అయిపోవడం. అందుకోసమే ఈ పోరాటాలు ఆరాటాలు అని నేరుగా చెప్పకుండా రాష్ట్రం కోసం తానొక్కడే పోరాడుతుంటే ప్రభుత్వం దానికి అడ్డు పడుతోందని వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తను రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శిస్తుంటారు. వారిద్దరిలో రాష్ట్రానికి ఎవరివల్ల మేలు కలుగుతోంది...ఎవరి వల్ల హాని కలుగుతోంది? అని ప్రజలే ఆలోచించుకోవాలి.

By
en-us Political News

  
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.