జగన్ అప్పుడే మొదలెట్టేశారు!.. ఫ్యాన్ స్పీడ్ తగ్గిందనా?

Publish Date:Apr 24, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహరచన, కార్యాచరణ అప్పుడే మొదలెట్టేశారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఇంకా రెడీ కాకపోయినా ఆయన తనపని ఆరంభించేశారు. ఇటీవలి వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఫ్యాన్ గాలి స్పీడ్ తగ్గిందన్న అభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటి నుంచే పని ప్రారంభించేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలలో తన విజయానికి తాను నిత్యం ప్రజల మధ్యలో తిరగడమే కారణమని నమ్ముతున్న ఇఫ్పుడు మరో సారి అదే చేయాలని వ్యూహ రచన చేస్తున్నట్లు అభిజ్ణ వర్గాల భోగట్టా. అయితే విపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్యలో ఉండటానికీ, ముఖ్యమంత్రి హోదాలో పర్యటనలు చేయడానికి చాలా తేడా ఉందన్న విషయం ఆయన గ్రహింపునకు రాలేదని అంటున్నారు. ఇప్పుడు జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళితే మూడేళ్ల పాలనా వైఫల్యాలపై సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అది చేయకుండా విపక్షాలపై విమర్శల దాడులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరదు.  
 ఇంతకీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు జగన్ రచిస్తున్న వ్యూహాలేమిటంటే...ఈ మూడేళ్ల వైఫల్యాలూ పాత మంత్రుల ఖాతాలో వేసి తాను పులు కడిగిన ముత్యమన్నట్లుగా జనంలోకి వెళ్లాలన్నదేనని విశ్లేషకుల అభిప్రాయం. అందుకే అసంతృప్తులకూ, అసమ్మతీయులకూ వెరవకుండా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారన్నది వారి విశ్లేషణ.
ఇక ఇప్పుడు తన జిల్లాల పర్యటనలకు ముందు పార్టీ కమిటీలతో, కార్యకర్తలతో, రిజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అద్యక్షులు..ఇలా ఒకరనేమిటి అందరితో సమావేశం ఏర్పాటు చేసి...ఆ సమావేశంలో తన జిల్లాల పర్యటన సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. విపక్షాలపై విమర్శలతో పాటు....ఈ మూడేళ్ల పాలనలో ఏవైనా వైఫల్యాలుంటే...అవి ఉద్వాసనకు గురైన మంత్రుల ఖాతాలో వేసేలా ఈ భేటీలో ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త టీమ్ తో సరికొత్తగా వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ఆరంభం కానున్న గడపగడపకూ వైసీపీలో కూడా ఇదే అగ్రపీఠిన నిలవాలన్నది ఆయన ఉద్దేశం.
ఇక పీకే, కాంగ్రెస్ ములాఖత్ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ వైఖరిపై పార్టీ శ్రేణులు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో వారికి క్లారిటీ ఇచ్చేందుకు కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్నికలు రెండేళ్ల ముందుగానే జగన్ పార్టీలో, పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడి రగిలించే ప్రయత్నం చేయడం వెనుక  తన ప్రభుత్వంపై ప్రజలలో అంగా సానుకూలత కనిపించడం లేదన్న నివేదికలే కారణమని అంటున్నారు. పీకే సర్వేలు కూడా ఇదే చెప్పడంతో ఆయన ఇప్పటి నుంచే పని మొదలెట్టేశారన్నది పరిశీలకుల విశ్లేషణ.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.