విదేశీ పర్యటనకు జగన్.. ఈ సారి ఎందుకోమరి?

Publish Date:Apr 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి, పార్టీ అంతర్గత పరిణామాల మధ్య ఆయన విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం పార్టీని అయోమయంలో పడేసింది.  జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ నెలలోనే ఆయన విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. జగన్ విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. ఆయన కుటుంబంతో సహా యూరప్, యూకే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 

అక్రమాస్తుల కేసు విచారణను ఎదుర్కొంటున్న జగన్, బెయిలుపై ఉన్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి తప్పని సరి.. ఈ నేపథ్యంలోనే ఆయన నాంపల్లిలోని సీబీఐ కోర్టులో అనుమతి కోరతూ పిటిషన్ దాఖలు చేయగా, ఆయన పిటిషన్ విచారించిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే వేదేశీ పర్యటనలో ఉండగా ఆయన కాంటాక్ట్ నంబర్, ఈ మెయిల్ ఐడీ సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. 

వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచీ  జగన్ ఎక్కువగా బెంగళూరులోని తన నివాసానికే పరిమితమవుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చి పార్టీ సమీక్షల్లో పాల్గొంటున్నప్పటికీ, ఎక్కువ సమయం రాష్ట్రం వెలుపలే గడుపుతున్నారు. ఈ పరిస్థితిపై సొంత పార్టీలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. జగన్ ఏపీకి వచ్చిన సమయం వినా, మిగిలిన సమయాల్లో వైసీపీ పరిస్థితి రాష్ట్రంలో ఉండీ లేనట్లుగానే ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలో  జగన్ విదేశీ పర్యటనపై  సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

 జగన్ గతంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో  పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి.  అన్నిటికీ మించి  రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిన కీలక సమయంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికలలో   కనీసం విపక్ష హోదా రాని విధంగా ఘోర పరాజయం తరువాత ప్రజాక్షేత్రంలో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన జగన్ బెంగళూరులో మకాం వేసి చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి రావడం పట్లే పార్టీ క్యాడర్ లో అసంతృప్తి ఉన్నది. ఇప్పుడు ఏకంగా నెల రోజులకు పైగా విదేశీ పర్యటనకు వెళ్లి  రాష్ట్రానికి ముఖం చాటేయడమేంటని పార్టీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

By
en-us Political News

  
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్, అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని రాహుల్ గాంధీ అభివర్ణించారు
చైనా ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు సాధారణ మందగమనం కంటే ఎక్కువగా, ఒక లోతైన వ్యవస్థాత్మక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఏడో రోజుకి చేరుకున్నాయి.
దేశ అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో శుక్రవారం అనూహ్యమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కాదు ్ర నాషిక్ పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి మరీ దర్యాప్తు చేస్తున్న కేసులు. టీసీఎస్ లో ఉద్యోగుల్లా చేరిన మహిళా పోలీసులు. సుమారు ఏడెనిమిది మంది మహిళా పోలీసులు టీసీఎస్ నాసిక్ యూటిన్ లో ఉద్యోగులుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా చేరారు. దాదాపు రెండు మూరు వారాలు.. కొన్ని నివేదిక ప్రకారమైతే 40 రోజులు అక్కడ పని చేసి వర్క్ ప్లేస్ బిహేవియర్ ను నేరుగా గమనించారు. పరిశీలించారు. గూమింగ్, లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ సేకరించారు. ఇది సాధారణ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణ కాదు. పూర్తిగా ప్రణాళికా బద్ధంగా జరిగిన అండర్ కవర్ ఆపరేషన్.
అమెరికాపై నాన్‌స్టాప్‌ సెటైర్లు వేస్తూ, ఏఐ, లెగో వీడియోలతో ఇరాన్ ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.