ప్రజా విశ్వాసం కోల్పోయిన జగన్ సర్కార్..!

Publish Date:Jul 18, 2022

Advertisement

ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారనడానికి  ఆ ప్రభుత్వం తన పథకాలను వివరించడానికి ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వాళ్లు నిలదీసే తీరులోనూ, ఏవైనా పనులకు టెండర్లు పిలిస్తే వాటికి వచ్చే స్పందనలోనూ.. ఇంకా చెప్పాలంటే ఆదాయం కోసం భూములు వేలానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంలోనూ తెలుస్తుంది. ఆ విధంగా చూస్తే  ఏపీలోని  జగన్ సర్కార్ పై జనాలు పూర్తిగా నమ్మకం కోల్పోయారనడానికి ఒకటి రెండూ కాదు వందల ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

కాంట్రాక్టర్లు  పనులకు టెండర్లు వేయడం లేదు. గతంలో చేసిన పనులకు సొమ్ముల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అంతెందుకు  వైసీపీ నేతలు కూడా కనీసం చిన్న చిన్న పనులను  నామినేషన్ కింద చేపట్టడాని కూడా ముందుకు రావడం లేదు. ఇఖ  జగనన్న లే ఔట్లు అంటూ ప్రభుత్వం స్థలాలను అమ్మడానికి చూస్తుంటే వాటిని కొనడానికి సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. మూడు రాజథానులలో ఒకటైన  పాలనా రాజధాని అని  చెబుతున్న విశాఖలోనే ప్రభుత్వ ప్లాట్లను కొనుగోలు చేయడానికి  ఎవరూ ముందుకు రావడం లేదు.  

జగనన్న లే ఔట్ల పేరుతో  విశాఖలో  రెండు వేల ప్లాటను జగన్ సర్కార్ వేలానికి పెట్టింది. ఇందుకోసం భారీగా ప్రచారం కూడా చేసింది. తీరా వేలం నిర్వహిస్తే  కనీసం  రెండు వందల  మంది కూడా ఆన్ లైన్ లో అప్లై చేయలేదు. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి  విడతగా కట్టాల్సిన డబ్బులు కట్టిన వారు కేవలం 70 మందే.      జగనన్న లేఔట్ల పేర  ప్రభుత్వం నేరుగా అమ్ముతున్నా జనం కొనడాగిని ముందుకు రాకపోవడం ఎలా చూసుకున్నా ఈ ప్రభుత్వంపై జనంలో విశ్వాసం లేదనే తేటతెల్లమౌతున్నది. ఎందుకంటే ప్రభుత్వమే విక్రయించే స్థలాలకు  క్లియర్ టైటిల్ ఉంటుంది.

అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలూ రావు. అని జనం భావిస్తారు. కానీ జగన్ సర్కార్ విక్రయానికి పెట్టిన లే ఔట్లను కొనుగోలు చేయడానికి జనం నుంచి  స్పందన లేకపోవడమే ప్రభుత్వ విశ్వసనీయత ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్ధమౌతుంది. అదే గత  తెలుగుదేశం ప్రభుత్వం  అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే భారీ స్పందన వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్లాట్లు మొత్తం అమ్ముడు పోయాయి.

జగన్  ప్రభుత్వం భూముల విక్రయానికి వేలం వేస్తే జనం  కనీసం పట్టించుకోవడం లేదు.  గడపగడపకూ  మన ప్రభుత్వం, సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తెలిసిందే. ప్రజల్లో జగన్ సర్కార్ పలుకుబడి పూర్తిగా పడిపోయిందనడానికి ఇవే నిదర్శనాలని విపక్షాలు అంటున్నాయి. ఎప్పుడూ విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్  ఇప్పుడు తన సర్కార్ పైనే జనాలు విశ్వాసం కోల్పోయారనడానికి కనిపిస్తున్న తార్కానాలపై ఏం చెబుతారని ప్రశ్రిస్తున్నారు.

By
en-us Political News

  
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం
కాక్రోచ్ పార్టీ కేవలం ఒక నిరసన వేదికగా కాకుండా, కాక్రోచ్ జనతా పార్టీగా రూపాంతరం చెందుతూ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
కూటమి రెండేళ్ల పాలనపై ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.
గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది.
రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.
నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది.
తన రాజీనామాను ఆయన శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.
ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణను అందిస్తూ సాగిన వాస్తవ వేదిక చర్చా..
ఆంధ్రప్రదేశ్ ఖనిజ మరియు గనుల సంపదకు సంబంధించిన తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ, మీ రిక్వెస్ట్ మేరకు రూపొందించిన ప్రత్యేక వ్యాసం కింద ఇవ్వబడింది.
మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.