ఆడలేక మద్దెలు ఓడు!

Publish Date:Jul 18, 2022

Advertisement

ఏపీలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైనా, జనం అష్టకష్టాలూ పడుతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదనీ, పట్టించుకోవడం లేదనీ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మంత్రి అంబటి మాత్రం తమ ప్రభుత్వం వరద సమయంలో అద్భుతంగా పని చేసిందనీ, ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందనీ చెబుతున్నారు. పోలవరం కాపర్ డ్యాం ఎత్తు పెంచి వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత మాదేనని చెబుతున్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే వరద బాధితులకు రేషన్ తో పాటు రెండు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకూ తమది మాత్రమేనని చెప్పు కుంటున్నారు. ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రుల ప్రకటనల సంగతి ఎలా ఉన్నా క్షేత్ర స్థాయిలో ప్రజలు మాత్రం  వరద ముంపునకు గురైన  తమను ప్రభుత్వం తమ ఖర్మకు తమను వదిలేసిందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో  ప్రజల నిరసన సెగలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే జగన్ మాత్రం ప్రజా నిరసనల గురించి ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.

అసలు ఎమ్మెల్యేలు తాను ఆదేశించినా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓ 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే  ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారనీ, మిగిలిన వారు అసలు పట్టించుకోనే పట్టించుకోవడం లేదనీ ఆగ్రహవం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమంపై సోమవారం సమీక్షించిన జగన్ ఎమ్మెల్యేల తీరుపై తవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గడప గడపకూ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లకు గడపగడపకూ కార్యక్రమమే గీటురాయని జగన్ స్పష్టం చేశారు. పని తీరు మార్చుకుని ప్రజల్లోకి వెళ్లిన వారికే టికెట్లని జగన్ స్పష్టం చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో జనం సమస్యలపై నిలదీస్తున్నారని చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భంగానే చెప్పేశారు. అప్పట్లో రూ.2 కోట్లు విడుదల చేస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఇది జరిగి మూడు నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

అసలు లోపం తన దగ్గర పెట్టుకుని మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏం లాభమని సమీక్షా సమావేశంలోనే పలువురు ఎమ్మెల్యేలు గొణుక్కున్నారని సమాచారం. ఆడలేక మద్దెలు ఓడు అన్న చందంగా నిధులు విడుదల చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేయండి అంటూ ఆదేశాలు జారీ చేసి.. మళ్లీ అవి పరిష్కారం కావడం లేదని చిటపటలాడటమేమిటని ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో మధన పడుతున్నారు. మీట నొక్కేసి అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నానని గప్పాలు కొట్టుకుంటే సరిపోదనీ, క్షేత్ర స్థాయిలో పథకాల కోతలపై జనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాగ్నిని గమనించాలని ఎమ్మెల్యేలు అంటున్నారు. అయతే ఈ విషయాన్ని నేరుగా అధినేతకు చెప్పేదెలా అని మధన పడుతున్నారు. బెజవాడ కార్పొరేషన్ నిధుల గురించి కొందరు అడిగితే అవే వస్తాయిలే అని తేలిగ్గా కొట్టిపారేయడాన్ని ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

మంత్రి శంకరనారాయణను నిలదీసిన మహిళపై మద్యం కేసు పెట్టడమేమిటని కూడా పలువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సమస్యపై నిలదీసినప్పుడు దానిని పరిశీలించి పరిష్కరించాల్సినది పోయి కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలలో మరింత పలుచన కావడం ఖాయమని వారు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. జగన్ చెప్పినట్లు ఇంక 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికైనా అధినేత తీరు మారకపోతే.. ఆయన టిక్కెట్లు ఇవ్వకపోవడమే ఎమ్మెల్యేలే మహద్భాగ్యంగా భావించే పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.