తగ్గింది ఆదాయం కాదు, ఆర్థిక క్రమశిక్షణ.. జగనన్న వల్ల కావట్లేదా?
Publish Date:Jan 21, 2022
Advertisement
అదేమీ రహస్యం కాదు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అద్వాన్నంగా వుంది. ఖజానా నిండుకుంది. శివాలయాన్ని తలపిస్తోంది. ఇందులో, ఇంకెవరికీ, ఇంకో అభిప్రాయం లేదు. ఎటొచ్చి, ఈ నిజాన్ని, అప్పులతో కప్పెట్టి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన గారి 40 మంది సలహాదారులు చేశారు. అయినా, అదేమీ దాగలేదు. బొక్కలు ఎప్పుడోనే బయట పడ్డాయి. ఆర్థిక మంత్రి బుగ్గన అప్పుల వేటలో క్షణం తీరిక లేకుండా ఎక్కే గడపా దిగే గడపా అన్నట్లుగా ‘యాత్రలు’ చేస్తూనే ఉన్నారు. ఈ మూడేళ్ల కాలంలో మూడొంతుల సమయం అప్పుల వేటలో గడిపేశారు. ఎక్కే.అసలు ఆదాయ వనరులు పెంచుకునే ఆలోచనే లేకుండా, పన్నులు, అప్పులు ఈ రెండే ఆదాయ మార్గాలుగా ఆర్థిక వ్యవస్థను అద్వాన్న స్థితికి చేర్చారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు మీడియా ముందుకు వచ్చి ఆదాయం ఎంత దారుణంగా పడిపోయిందో వివరించేందుకు,పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రూ.98వేల కోట్ట్లు ఉండవలసిన రాష్ట్ర ఆదాయం కేవలం రూ.62 వేల కోట్ల దగ్గరే ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. అంతే కాదు, ఈ దౌర్భాగ్య పరిస్థితికి తమ బాధ్యత లేదని, నేరం మాది కాదు, కరోనాది’ అంటూ తప్పు మొత్తాన్ని కరోనా మీద నెట్టేసి, చేతులు ‘సానిటైజర్’తో కడిగేసుకున్నారు. అయితే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్న మాట కొంత వాస్తవమే అయినా, అదొక్కటే కారణం కాదు. నిజానికి అసలు కారణం అది కానే కాదు, అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. వైసీపీ ప్రభుత్వం ఏ క్షణాన అధికారంలోకి వచ్చిందో, ఆ క్షణం నుంచే ఆర్థిక క్రమ శిక్షణ పట్టాలు తప్పింది. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ప్రదేశ్’గా దిగాజారదానికి, దే సాలు కారణం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అంతకు ముందు ఐదేళ్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విభజన ఆటుపోట్లను తట్టుకుని, ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే అన్ని వ్యవస్థలతో పాటుగా ఆర్థిక వ్యవస్థను కూల్చి వేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు, ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా అనే, ఆలోచన చేశారే తప్ప, మరో ఆలోచన చేయలేదు.ఓటు బ్యాంకును పదిలి పరుచుకునేందుకు, ఖాజానాలో పడిన ప్రతి పైసాను సంక్షేమం పేరున పంచుకుంటూ పోయారు. అయితే, నిజంగా సొమ్ములన్నీ సంక్షేమానికే ఖర్చు చేశారా, అంటే అదీ లేదు.పేదలకు పంచినదాని కంటే, ఆ పేరున, ఇతరత్రా పెద్దలు బొక్కిందే ఎక్కువని లెక్కలు చెపుతున్నాయని అంటున్నారు, అందుకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలుగు దేశం పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. అదలా ఉంటే, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీతాల కోతకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్న మాటలు, చూపుతున్న లెక్కలు తప్పని ఆర్థిక శాఖ వర్గాలే అంటున్నాయి. నిజానికి, సమీర్ శర్మ చెపుతున్నది, తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ మేతకు అన్నట్లుగా ఉందని అదే అధికారులు అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉన్నది ఎంత నిజమో, అందుకు కొవిడ్ కారణంగా ఆదాయం పడిపోవడం కారణం కాదనేది కూడా అంతే నిజం అంటున్నారు. కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రకారం గడచిన రెండు సంవత్సరాలలో రాష్ట్ర ఆదాయం తగ్గలేదు. పెరిగింది. అవును, గడచిన రెండేళ్లలో రాష్ట్ర ఆదాయం ఏకంగా 39శాతం పెరిగిందని కాగ్ స్పష్టం చేసింది. అంటే ఇంత కాలం ప్రభుత్వం తనను తాను మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేస్తూ వచ్చిందనే విషయం ఇప్పుడు తేట తెల్లంగా తెలిసి పోయింది. అయితే ఎంత మోసానికి మారు పేరు అయిన జగన్మోహన్ రెడ్డి అయినా, అందరినీ అన్ని కాలాలలో మోసం చేయ లేరు. అందుకే, రెండున్నరేళ్ళు నిండకుండానే, రోజులు లెక్కపెట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. చేకున్నవారికి చేసుకునంత.
http://www.teluguone.com/news/content/jagan-failures-on-ap-economic-growth-25-130497.html





