జగన్, కాంగ్రేసు-ఎవరిని ఎవరు కోల్పోయారు?

Publish Date:Dec 8, 2012

Advertisement

 

రాష్ట్రంలో నేడు రెండు ప్రధాన అంశాలు చర్చలో ఉన్నాయి. మొదటిది తెలంగాణా కాగా, రెండోది రాష్ట్ర రాజకీయాలపై జగన్ పార్టీ ప్రభావం. తెలంగాణా అంశంతో అన్నిరాజకీయ పార్టీలు బంతాట ఆడుకొంటుండగా, జగన్ విషయంలో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అనేక కేసులలో సతమతమవుతు ఇప్పట్లో బెయిలు కూడా దొరకని పరిస్తితిల్లో అతను జైల్లో ఉన్నపటికీ అనేక మంది ఇతర పార్టీల సభ్యులను, తన పార్టీలోకి ఆకర్షించగలుగుతున్నాడంటే రాష్ట్ర రాజకీయాలపై అతని ప్రభావం ఎంతగా ఉందో అర్ధమవుతోంది. ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా కాదనలేని నిజం ఇది. అందుకనే, కాంగ్రెస్ అధిష్టానం సైతం మొన్న పంపిన పరిశీలకులతో జగన్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని రాష్ట్ర నేతలను అడిగింది. వారు కూడా అతని ప్రభావం బాగానే ఉందని చెప్పినట్లు తెలిసింది.

 

మరి అంతటి ప్రభావశీలి అయిన ఒక యువ నాయకుడిని, కేవలం కొందరు సీనియర్ నాయకుల సలహాల మేరకు దూరం చేసుకొన్న కాంగ్రేసు నష్టపోయిందా? లేక, తన తొందర పాటుతో తన రాజకీయ భవిష్యత్తుని తానే గందరగోళంలో పడేసుకొన్నాడా? ఏమతేనేమి, ఇటు కాంగ్రెస్, అటు జగన్ ఇద్దరు నష్టబోవడమే గాక, ఇప్పుడు అందుకు తీరికగా విచారించ వలసివస్తోంది వాళ్ళకి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు, కొందరి అనాలోచిత సలహాల వల్ల తొందరపడి ముఖ్యమంత్రి పీఠం తన సొత్తుగా భావించి కాంగ్రేసు అధిష్టానానికి ఎదురు తిరగడం అతను చేసిన పోరాపటయితే, 120 సంవత్సరాల అనుభవంఉన్న కాంగ్రేసు, అతనికి నచ్చజెప్పి దారికి తెచ్చుకొని అతనిని తన ఆయుధంగా మలుచుకోలేకపోవడం ఒక చారిత్రాత్మక తప్పిదం అనిచెప్పవచ్చు.

 

కాంగ్రేసు అధిష్టానంతో సయోధ్య కుదుర్చుకోవడంలో విఫలం అవడంలో కేవలం అతని పాత్రే లేదు. అతని వెంట ఉండి అతనికి ఆవిదంగా వెళ్ళమని రాజకీయ సలహాలు ఇచ్చిన వారిని సైతం ఇందుకు తప్పు పట్టక తప్పదు. అదే సమయంలో అతని విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి శల్యసారద్యం చేసి అతనిని తెలివిగా పార్టీకి దూరం చేసిన వారూ ఉన్నారు. కాంగ్రేసులో తమ అనుభవమంత వయసుకూడా లేని ఒక కుర్రకుంక కేవలం తన తండ్రి కీర్తి ప్రతిష్టలను ఆసరాగా చేసుకొని తమని మించిపోవడం సహించలేని నేతలే అతనిని పార్టీ అధిష్టానానికి విరోధిగాచేసి బయటకి వెళ్ళే పరిస్తితులు సృష్టిమ్చేరని చెప్పవచ్చు.

 

అయితే, అప్పటికయినా మళ్లీ పరిస్తితులు చక్కదిద్దుకొనే అవకాశం అతనికి ఉంది. గానీ, జగన్మోహన్ రెడ్డికి సరయిన రాజకీయ సలహాలిచ్చేవారు కరువయ్యారు. ఒక వేళ ఉండి ఉంటే, వెంటనే వారు రంగంలోకి దిగి పరిస్తితులు చక్క దిద్ది అతను కాంగ్రెసులోనే కొనసాగేలాగ చేసేవారు. కాని, జగన్మోహన్ రెడ్డి కి తగిన రాజకీయ సలహాదారులు కరువయ్యారు. ఉన్నకొద్ది మందిని తన అభిజ్యాతంతో తనే దూరం చేసుకొన్నాడు. ఒక వేళ, అతను కొంచెం తగ్గి పార్టీలోనే కొనసాగి ఉంటె నేడు అతని పరిస్తితి, హోదా తప్పక వేరేలా ఉండేవి. అయితే, జగన్ తన తొందరపాటు నిర్ణయంతో కాంగ్రెసును వీడి బయటకి వచ్చి తన ప్రమేయం లేకుండానే ఇంటా,బయటాకూడా శత్రువులను పోగేసుకొన్నాడు.

 

తన తండ్రి మరణంతో ఏర్పడిన సానుబూతిని ప్రజలు మరువకమునుపే వారి ‘ఓదార్పు’తో తానూ రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచనతో అతను ‘ఓదార్పు యాత్ర’ మొదలు పెట్టి, తనకి మద్దత్తు కూడగట్టుకొనే ప్రయత్నం చేసాడు. అది కాంగ్రేసుకి యెంత మాత్రం నచ్చలేదు. ఆ సంగతి అతనే స్వయంగా చెప్పడమే గాక, తదనంతర పరిణామాలలో అది స్పష్టంగా కనిపించింది కూడా. అయితే, ఆటను చేపట్టిన ఓదార్పు యాత్ర రాజకీయంగా అతనికి చాల లబ్దినిచ్చిందని ఇప్పుడు రుజువవుతోంది. తన ఓదార్పు ద్వారా పార్టీని ఎర్పరచకముందే తగిన బలం కూడా గట్టుకోవడమే గాకుండా, ప్రజలకి చేరువయ్యాడని చెప్పవచ్చు.

 

అయితే, అదే సమయంలో ప్రధాన పార్టీలయినా కాంగ్రెస్, తే.దే.పా.లకి అతను, అతని పార్టీ బద్ద శత్రువులుగా మారేరు. చివరికి అదే అతనిని జైలు పాలు చేసింది కూడా. తమ బలమయిన ఆయుధంగా మలుచుకోవలసిన అతనిపై కాంగ్రెస్ సిబిఐ అనే ఆయుధం ప్రయోగించింది. అది ప్రయోగించి వదిలేసినప్పటికీ, అది అతని వెంట పడి అతని మూలాలు పట్టుకొని ప్రజల ముందు అవినీతిపరుడిగా ఒక ముద్ర పడేందుకు దోహదపడింది. అంటే, అతను కాంగ్రెసులోనే ఉండి ఉంటే అతనికి ఈకష్టాలు ఉండేవి కావు, అతనిపై ఈ ముద్ర ఎన్నటికీ పడేది కాదన్నమాట. ఏమయినప్పటికీ, ఇప్పుడు అతని అక్రమ ఆస్తుల వ్యవహారాలు బయటకి పొక్కడంతో కోర్టులు కూడా అతని మీద జాలి చూపించడం మానేసాయి.

 

అయినప్పటికీ, అతని మానస పుత్రిక సాక్షి పత్రిక, మరియు సాక్షి టీవీ కలిసికట్టుగా అతనిని బాగానే ప్రజలోకి తీసుకు వేల్లగలిగేయని చెప్పవచ్చు. దానికితోడూ, అతని తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కలిసి ‘జగన్ని అన్యాయంగా జైలు పాలు చేసారనే’ ప్రచారం కూడా అతనికి కొండంత సానుబూతి తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా నిరక్షరాస్యులు అదికంగాఉన్న మనరాష్ట్రంలో ఆపని మరింత సులువు అయిందని చెప్పవచ్చును. అందుకే, గ్రామీణ ప్రజలు విజయమ్మ షర్మిలాల వెంట నడుస్తోన్నారు. ప్రజలలో ఈ ఆదరణని చూసే వివిధ పార్టీలలో నేతలు చంచలగూడ జైలు వైపు అడుగులేస్తున్నారిప్పుడు.

 

కాంగ్రేసులో నెలకొన్న ప్రస్తుత అయోమయస్తితి, పరిపాలన స్తంబించిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం, ప్రధాన ప్రతిపక్షమయిన తే.దే.ప. నేతలలో తెలంగాణా సమస్య వల్ల ఏర్పడిన అంతులేని నిర్లిప్తత, నానాటికి పెరుగుతున్న ధరలు,షాకిచ్చే కరెంటు బిల్లులతో తల్లడిల్లుతున్న ప్రజల అసహనం అన్నీ కలిసి, ప్రజలు మరోసరికొత్త నేతకోసం తలుపులు తెరిచి మరీఎదురు చూస్తున్నారని గ్రహించిన మన రాజకీయ నేతలకి సహజంగానే జైల్లో ఉన్న జగన్ జగన్మోహనాకారుడిగా కనిపించడంలో వింతేమి లేదు.

 

అయితే, దేశాన్నిఎక్కడికో తీసుకుపోగల యువనేత మా రాహుల్ బాబు అని పార్టీ నేతలతో పొగడబడుతున్న రాహుల్ గాంధీ కూడా చంచల్గూడా జైలు వైపే చూడడం రాష్ట్ర రాజకీయాలపై జగన్ ప్రభావం యెంత బలంగా ఉన్నదో తెలియజేస్తోంది. ఇక, అతనే స్వయంగా కాంగ్రేసులో కలుస్తాడా లేక కాంగ్రేసే అతనితో జత కడుతుందా అనేది కాలమే చెపుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.