హిందూ వ్యతిరేకత విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ ల మధ్య నేనంటే నేను గోప్ప అన్న సంవాదం నడుస్తోందా? తాజాగా ఇరువురూ చెన్నైలోని ఓ వివాహ వేడుకలో కలుసుకుని పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు జగన్, ఉదయనిథి స్టాలిన్ హాజరయ్యారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ఎందరో అతిరథ మహారథులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారనుకోండి అది వేరే సంగతి. జగన్ ఉదయనిథి స్టాలిన్ ఇరువురూ ఆ వివాహ వేడుకలో కలిసి కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో నెటిజనులు వారి హిందూ వ్యతిరేక వైఖరిపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఆ ట్రోలింగ్ లో భాగంగానే సనాతన ధర్మం అనేది వైరస్ అని భలే అన్నావ్ అని జగన్ రెడ్డి అంటే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన నీ ముందు నేనెంత అన్న చర్చ జరిగి ఉంటుందంటూ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. హిందూ ధర్మంపై వ్యతిరేకత విషయంలో ఉదయనిధి స్టాలిన్, వైఎస్ జగన్ లలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ అన్న డిబేట్ కు కూడా వీరిరువురి భేటీ దృశ్యాలు దోహదం చేశాయి. వీరిరువురిలో ఉదయనిథి స్టాలిన్ ఒక రకంగా బెటర్.. ఆయన ఎటువంటి దాపరికం లేకుండా తన హిందూ వ్యతిరేక వాణిని కుండబద్దలు కొట్టినట్లు బాహాటంగానే వ్యక్తం చేశారు.
ఆ విషయంలో ఆయనకు ఎటువంటి శషబిషలూ లేవు. అయితే జగన్ అలా కాదు.. ఓ పక్క తాను హిందూ వ్యతిరేకిని కానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే.. చేతల్లో తన వ్యతిరేకత చూపుతుంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరకామణి చోరీ చాలా చిన్న వ్యవహారం అనడం. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ అని ధృవపడినా, అందులో జంతువుల కొవ్వు కలవలేదుగా అంటూ బుకాయించడం వరకూ జగన్ హిందూ వ్యతిరేకతను చాపకింద నీరులా కనిపించీ కనిపించకుండా చాటుతున్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ ఇద్దరే. హిందూ వ్యతిరేకత విషయంలో ఎవరినీ తక్కువ చేయడానికి అవకాశం లేదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-and-udayanithi-stalin-25-213759.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.