జగన్ పునరాలోచన!

Publish Date:Nov 10, 2013

Advertisement

 

విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడమే వైసీపీ అధినేత జగన్ విధానంలా కనిపిస్తోంది. విభజన వాదం నుంచి సమన్యాయ వాదానికి మళ్ళీ అక్కడి నుంచి సమైక్య వాదానికి షిష్టయిన జగన్‌లో ఇప్పటికీ క్లారిటీ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమంటే విభజనకు అంగీకరించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. తమ పార్టీకి రాష్ట్ర విభజన ఇష్టం లేదు కాబట్టి ఆ సమావేశానికి తమ పార్టీ వెళ్ళబోదని జగన్ మొదట్లో ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం ఐడియా వచ్చిందోగానీ, తాజాగా జీఓఎం సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిగా మైసూరారెడ్డి వెళ్తారని ప్రకటించి రాష్ట్ర విభజన మీద తనకున్న మక్కువను బహిర్గతం చేశారు. ఆ సమావేశానికి మీ పార్టీ నుంచి సభ్యుడిని పంపితే విభజనకు ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నిస్తే, అబ్బే మైసూరారెడ్డి మీటింగ్‌కి వెళ్ళి విభజనకు ఒప్పుకోరు.. కేంద్ర మంత్రుల బృందాన్ని బాగా తిట్టి, వాళ్ళకి సమైక్య పాఠాలు బోధించి వస్తారని జగన్ వివరణ ఇచ్చాడు. అసలు  ఆ మీటింగ్‌కి వెళ్ళకపోతేనే రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు లెక్క! అలాంటప్పుడు ప్రత్యేకంగా మీటింగ్‌కి వెళ్ళి విభజనని వ్యతిరేకిస్తున్నామని చెప్పడమెందుకో కిందున్న జగన్మోహనరెడ్డికి, పైనున్న ఆ రాజశేఖరరెడ్డికే తెలియాలి. మైసూరాని మీటింగ్‌కి పంపాలని తాను తీసుకున్న నిర్ణయానికి సమైక్యవాదుల నుంచి, వైఎస్సార్ సీపీ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ వుండటంతో జగన్ మరోసారి తన విధానాన్ని మార్చుకునే ఉద్దేశంలో వున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. మొన్నటి వరకూ వీర తెలంగాణవాదిగా ముద్ర పడిన బీజేపీ కూడా మంత్రుల బృందం మీటింగ్‌కి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. అలాంటప్పుడు సమైక్యవాద పార్టీగా క్లెయిమ్ చేసుకుంటున్న తమ పార్టీ ఆ ‌మీటింగ్‌కి వెళ్తే సీమాంధ్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచన వైసీపీ పార్టీ వర్గాల్లో నలుగుతోంది. దాంతో మంత్రుల బృందం మీటింగ్‌కి తమ  పార్టీ నుంచి మైసూరాని పంపకుండా వుంటే ఎలా వుంటుందన్న దానిమీద పార్టీలో తీవ్ర స్థాయిలో తర్జన భర్జనలు జరుగుతున్నట్టు సమాచారం.

By
en-us Political News

  
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.