జగన్ టీం.. కేరాఫ్ బెజవాడ జిల్లా జైలు.. పరమర్శకు జగన్ వెళ్లేదెప్పుడు?

Publish Date:Apr 28, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కపెడుతోందా? అంటే అందరూ కాకపోయినా చాలా మంది పరిస్థితి అలాగే ఉందని సమాధానం వస్తుంది. ఇప్పటి జగన్ అక్రమాలలోనూ, అవినీతిలోనూ, దౌర్జన్యాలలోనూ భాగస్వాములైన వంశీ, రాజ్ కసిరెడ్డి, ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, సజ్జల శ్రీధర్ రెడ్డిలు వేరువేరు కేసులలో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే గత 75 రోజులుగా బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆయన బెయిలు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

 ఇక మద్యం కుంభకోణంలో కర్త, క్రియ, కర్మగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి సైతం అరెస్టై ఇదే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆయనపై ఇసుక మాఫీయా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు త్వరలో ఈ కేసులో కూడా ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు. అంటే ఆయనకు కూడా ఇప్పటిలో బెయిలు వచ్చే అవకాశాలు మృగ్యమే. ఇక మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించి కోర్టులో ప్రవేశ పెట్టగా ఆయనను కూడా కోర్టు విజయవాడ జిల్లా జైలుకు రిమాండ్ చేసింది. అదే విధంగా ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కూడా అక్కడే ఊచలు లెక్కపెడుతున్నారు. వీరందరూ ఒకే బ్యారక్ లో వేరువేరు సెల్స్ లో ఉన్నారు.

ఎప్పుడో వల్లభనేని వంశీ అరెస్టైన సమయంలో జగన్ విజయవాడ జిల్లా జైలుకు వచ్చి ఆయనతో ములాఖత్ అయ్యారు. పరామర్శించారు. ధైర్యం చెప్పారు. అయితే ఆ తరువాత అరెస్టైన రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులును జగన్ ఇంకా పరామర్శించలేదు. ఆయన జైలు పరామర్శ యాత్రలకు విరామం ప్రకటించినట్లుగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. 

దర్యాప్తు సంస్థల వేగం దూకుడూ చూస్తుంటే ముందు ముందు మరింత మంది జగన్ బ్యాచ్ నేతలు అరెస్టయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే జరిగితే విజయవాడ జిల్లా జైలుకు మరింత మంది వీఐపీలు రిమాండ్ ఖైదీలుగా వచ్చే అవకాశం ఉంది. వారంతా కూడా జైలుకు వచ్చిన తరువాత తీరిగ్గా అందరినీ ఒకే సారి పరామర్శించేయవచ్చన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లున్నారంటూ నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు.  

By
en-us Political News

  
భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు. సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు.
ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్‌తో తలపడొద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాక్‌ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దు మణిగిందా? అంటే గులాబీ పార్టీ నేతలు అవుననే అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్డుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందుతరం నేతలు.
పార్టీ బతికి బట్టకట్టాలంటే మోడీయే దిక్కు అంటున్న వైసీపీ సీనియర్లు వైసీపీ బతికి బట్టకట్టాలంటే మోడీని శరణు జొచ్చడం వినా మరో మార్గం లేదని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారా?
పాతిక వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తెలుగువన్ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రజతోత్సవ సభకు నిండుదనం తెచ్చారు
తెలుగువన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్‌తో ప్రతి దేశంలో ఉందంటే అందదుకు రవిశంకర్ కృషి, పట్టుదలే కారణమన్న చంద్రబాబు.. తాను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్‌ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకెళ్తున్నారన్నారు.
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలో ఒక మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
 తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ​దాడికి పాల్పడ్డాడు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి నందిగం సురేష్​, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు
హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాద వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని ఆయన తెలిపారు.
హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ ముగిసిన తర్వాత వీఐపీ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి రేవణ్ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన సతీమణి నిక్కీ గల్రాని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఇంచుమించుగా 18 నెలలు అంటే సంవత్సరంన్నర కావస్తోంది. ద్వితీయ వార్షికోత్సవం దగ్గర పడుతోంది.కానీ, ఇంత వరకు పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కారాణాలు ఏమైనా, గతంలో అనేక మార్లు పెట్టిన మంత్రివర్గ విస్తరణ ముహూర్తాలు వచ్చి పోయాయే కానీ, ఏ ఒక్కటీ ముడి పడలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.