అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానం.. జగన్ కింకర్తవ్యం?

Publish Date:Apr 28, 2025

Advertisement

అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సారి అమరావతి పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా, అత్యంత వేగంగా పూర్తి చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు  41 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు   ఖరార య్యాయి.  అలాగే  రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.4,700 కోట్ల అంచనా వ్యయంతో ఐదు టవర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్టేట్ సెక్రటేరియట్‌ను నిర్మాణానికి టెండర్లు పిలిచింది. అమరావతి పూర్తికి మూడు సంవత్సరాల గడువును నిర్ణయించి.. ఆ దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు.  

ఇక అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2015లో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి జగన్‌ను  ఆహ్వానించారు, కానీ అప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.  ఆ తరువాత 2019లో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు.  అయితే 2024 ఎన్నికలలో  జనం జగన్ ను అధికారం నుంచి దించేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికే ఓటుశారు.  

ఇప్పుడు చంద్రబాబు నిర్దిష్ట కాలవ్యవధిలో అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అదలా ఉంచితే.. ఇప్పుడు ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి జగన్ హాజరౌతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు సరైన కారణం చూపకుండా జగన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు అవ్వడం అంటే ప్రజాభిష్ఠాన్ని ఖాతరు చేయకపోవడమే అవుతుంది. జగన్ మూడు రాజధానుల విధానాన్ని జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఇక అంటే జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని తేల్చేశారు. ఈ దశలో అందుకు పడుతున్న కీలక ముందడుగు అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి జగన్ తన అహంకారంతో గైర్హాజరైతే.. జనానికి మరింత దూరమౌతారు. ఆయన ఎటూ రారని ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపకుంటే.. అదే వేరే విషయం కానీ, ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా కూడా గైర్హాజరు కావడాన్ని జగన్ ఎలా సమర్థించు కుంటా రన్నది ఆయనకే తెలియాలి. కానీ, సమస్య ఏమిటంటే జగన్  జనం ఇవ్వని ప్రతిపక్ష హోదా డిమాండ్ తో అసెంబ్లీనే బాయ్ కాట్ చేశారు. అలాగే ఇప్పుడు అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికీ డుమ్మా కొట్టే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.