Publish Date:Apr 15, 2024
గోప్యత ఏమీ లేదు.. అంతా బరితెగింపే. వైసీపీ దృష్టిలో ఎన్నికల రణం అంటే భౌతిక దాడులతో పై చేయి సాధించడమే! ఈ యుద్ధంలో శాంతి భద్రతల గురించిన పట్టింపే ఉండదు. తమ అరాచకాలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పీఎస్ లపైనా దాడులే. ఏపీలో పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఆనవాలే కనిపించడం లేదని అనిపించక మానదు.
బందరులో మాజీ మంత్రి పేర్ని నాని, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబుల తీరు చూస్తే వైసీపీ మూడ్ ఏమిటన్నది ఇట్టే అవగతమైపోతుంది. మచిలీపట్నంలో వైసీపీ మూకలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇది స్వయంగా మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో జరిగింది. దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదయ్యాయనుకోండి అది వేరే సంగతి. ఇంత కాలం తమ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు.. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే సిన్సియర్ గా డ్యూటీలు ఎలా చేస్తారు. అలా చేస్తే మేం ఎందుకు సహిస్తాం అంటున్నట్లు ఉంది మచిలీపట్నంలో పోలీసు స్టేషన్ పై జరిగిన దాడి. నిజమే నిన్నటి దాకా జీహుజూర్ అన్న వాళ్లు ఇవ్వాళ తలెగరేస్తే ఎలా? కాస్త చూసీ చూడనట్లు వదిలేయండి అని ఎదురు పోలీసులకే వారి పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయా అన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
మొన్నటికి మొన్న ఒంగోలు ఎంపీ బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో గాయపడిన తెలుగుదేశం నాయకుడు మేడికొండ మోహనరావు, కార్యకర్తలు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంటే బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డి అనుచరులను వెంటపెట్టుకుని వెళ్లి మరీ ఆస్పత్రిలో బీభత్సం సృష్టించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై తెలుగుదేశం తరఫున ఒంగోలు లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ లు ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కానీ ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే బాలినేని చేసిన ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేశారు. నిజంగానే ఏపీలో ఎన్నికల కోడ్ అమలౌతోందా అన్న అనుమానాలు కలగడానికి ఇటువంటి ఘటనలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ రెండు సంఘటనలూ మచ్చుకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అరాచకాలకు పోలీసులు కొమ్ము కాస్తూనే ఉన్నారు.
ఇక సత్తెన పల్లి వైసీపీ అభ్యర్థి అంబటిరాంబాబు అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఇద్దరు యువకులను విడిపించుకోవడానికి చేసిన హంగామా మరో ఎత్తుకు చేరింది. యువకులను వదిలేయడమే కాదు.. మద్యం బాటిళ్లను కూడా తిరిగి ఇచ్చేయాలంటూ ఆయన పట్టుబట్టారు. అందుకు అధికారులు నిరాకరించడంతో మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బెదరింపులకు దిగారు. ఈ సంఘటనలన్నీ బహిరంగంగా జనం చూస్తుండగా జరిగినవే. అయినా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ల లేదంటే నమ్మలేం. ఎన్నికల సంఘం వేగంగా స్పందించకుంటే ఆ వ్యవస్థపై జనంలో అంతో ఇంతో ఇంకా ఉన్న నమ్మకం కూడా పోతుందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-tyranny-election-strtegy-of-ycp-25-173846.html
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.