Publish Date:Apr 15, 2024
ఏవమ్మా బంగారమ్మా... ఏంటి నీ వరస? రోజురోజుకీ రేటు పెంచేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. రెండో దశ కరోనా సంక్షోభానికి ముందు నీ రేటు దగ్గర దగ్గరగా తులం 40 వేలు. జస్ట్ మూడేళ్ళ గ్యాప్లో నీ రేటుని తులానికి 75 వేలకు పెంచేసుకున్నావ్. గతంలో భారతీయులకు నగల మీద మోజు ఎక్కువ కాబట్టి, వాళ్ళ వల్ల బంగారానికి డిమాండ్ క్రియేట్ అయ్యేది. తద్వారా రేటు పెరిగింది.
ఈ మధ్యకాలంలో భారతీయుల కొనుగోలు శక్తి ఏమంత పెరగలేదే? అయినా నువ్వెందుకు ఈ రేంజ్లో పెరిగిపోతున్నావేంటా అని ఆలోచిస్తే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం, బంగారం గనుల్లో సమ్మె జరుగుతూ వుండటం వల్ల అవసరమైనంత బంగారం ఉత్పత్తి జరగడం లేదు. దాంతో డిమాండ్ క్రియేటయింది. ఫలితం.. నీ రేటు పెరిగిపోతోంది. అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలు నీ ధరని భారీ స్థాయిలో పెంచేస్తున్నాయి.
తాజాగా పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులు కూడా నీ రేటు పెంచేశాయి. సిరియాలోని తమ రాయబారి కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ మీద ఇరాన్ ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చని వినిపిస్తున్న వార్తల కారణంగా నువ్వు నెత్తికెక్కి కూర్చుంటున్నావ్. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు కూడా తమ దగ్గర డబ్బుని బంగారం రూపంలో మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న పెద్దపెద్ద బ్యాంకులు కిలోలు రెండు కిలోలు కాకుండా వేల కిలోల బంగారాన్ని కొనుగోలు చేస్తూ వుండటంతో నీ రేటు కొండెక్కి కూర్చింది.
ఒకవైపు నీ రేటు పెరిగి, బడుగు జనం బంగారాన్ని కొనలేకపోతుంటే, నిన్ను చూసి మరోవైపు నీ ఫ్రెండ్ వెండి రేటుని కూడా పెంచేస్తున్నారు. మొన్నటి వరకు 75 వేల రూపాయలున్న వెండి కిలో ఇప్పుడు 88 వేల రూపాయలకు చేరుకుంది. మీరెప్పుడు దిగొస్తారో ఏంటో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gold-price-goes-sky-25-173844.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.