ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజనా?
Publish Date:Dec 17, 2025
Advertisement
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కెరీర్పై టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చని చెప్పుకొచ్చాడు. అందుకే మేనేజ్ మెంట్ టీమ్ లోకికి యువ ప్లేయర్లను తీసుకున్నట్లు వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోనీ ని ఆయన్ను చూస్తే చాలు అనుకునేవాళ్లు కొంతమంది. ఏదో ఒక ఫార్మాట్.. ఆడితే చాలు అనుకునేవాళ్లు మరికొంత మంది. ప్రతి ఐపీఎల్ సీజన్ చివర్లో.. అభిమానుల గుండెల్లో ఓ గుబులు.. మాహీ ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలుకుతాడా? అని. ధోనీ కూడా ఏం తక్కువ కాదు, మోకాళ్ల నొప్పి వేధిస్తున్నా.. వికెట్ల మధ్య పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నా.. తమ అభిమానుల కోసమే అన్నట్టుగా ప్రతి ఐపీఎల్కు సిద్ధమవుతుంటాడు. ఈ సారి కూడా తాను ఐపీఎల్ ఆడతున్నట్లు ఏదో రకంగా హింట్లు ఇస్తూ వస్తాడు. క్రీజులో నిలబడి భారీ షాట్లు కొట్టాలన్నా.. సెకండ్లలో స్టంప్స్ పడగొట్టాలన్నా మాహీనే కావాలి. ధోనీ బ్యాటింగ్కి రాకపోయినా పర్వాలేదు.. జట్టులో ఉంటే చాలు అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటు ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అలజడి సృష్టించే వార్త ఒకటి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప నుంచి వచ్చింది. పరిస్థితులను చూస్తుంటే ధోనీకిదే చివరి సీజన్ అవ్వొచ్చు. ఆపై ఎడిషన్ ఆడతాడని తాను అనుకోవడం లేదని ఉతప్ప చెప్పాడు. ఐపీఎల్ మినీ వేలంలో సీఎస్ కే ఎక్కువగా యువ క్రికెటర్లపై ఇన్వెస్ట్ చేసిందనీ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వంటి టాలెంట్ కలిగిన యువ క్రికెటర్లను ఫ్రాంచైజీతో ఉంచుకుందన్నారు. ధోనీ మరిన్ని సీజన్లు ఆడకపోవచ్చనే దానికి ఇది సూచికని, క్రికెటర్గా ఆడకపోయినా సీఎస్ కేకు ధోనీ మెంటర్గా వస్తాడని చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్లే సీజన్ వేలంలో సీఎస్కే యూపీకి చెందిన 20 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్లో పాటు రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ , బ్యాటర్ కార్తీక్శర్హలను అన్ క్యాప్డ్ అటగాళ్లయినప్పటికీ చెరో 14.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో మొత్తం 9 మంది యువ క్రికెటర్లను చెన్నై సొంతం చేసుకోవడం భవిష్యత్తు అవసరాల కోసమే అంటున్నారు.
http://www.teluguone.com/news/content/is-this-tle-last-ipl-for-dhoni-36-211139.html





