Publish Date:Jun 30, 2026
అంతర్జాతీయ రాజకీయ యవనికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా దేదీప్యమానమైంది. శాంతి, స్థిరత్వం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందిం చడంలో ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారంటూ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కి యన్ ప్రశంసల వర్షం కురిపించారు. మసూద్ పెజెష్కియన్ మంగళవారం (జూన్ 30) ప్రధాని మోడీతో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సంభాషణ సారాంశాన్ని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. మసూద్, మోడీ టెలిఫోన్ టాక్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఇరు నేతలు గుర్తుచేసుకున్నారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురూ భావించారు. ఇటీవల భారతదేశం అత్యంత విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం పట్ల ముసూద్ హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల ద్వారా రాబోయే రోజుల్లో భారత్, ఇరాన్ దేశాల మధ్య వ్యూహాత్మక బంధం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై అనేక కీలక అంశాల్లో ఇరు దేశాల అభిప్రాయాలు ఏకీభవించడం ఈ వ్యూహాత్మక బంధానికి మరింత ఉతం ఇస్తోందన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, తాజా పరిణామాలపై కూడా మోడీ, మసూద్ లు ఈ సందర్భంగా చర్చించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాలకు ఇరాన్ పూర్తిగా కట్టుబడి ఉందని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చెప్పారు. కేవలం ఒక వైపు నుంచే కాకుండా, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, భద్రతల స్థాపన కోసం ఇతర పక్షాలు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం అనుసరిస్తున్న తటస్థ, శాంతియుత విదేశాంగ విధానమే నేడు ఇరాన్ వంటి దేశాల నుంచి ఈ స్థాయి ప్రశంసలు దక్కేలా చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iranian-president-showers-praise-on-pm-modi-36-224704.html
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
రౌడీషీటర్ కేసు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు.
లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.
నెట్వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30, అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నాని పాత కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై అప్పట్లో నమోదైన కేసులో చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమయ్యారు.
2024 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాధవీలత.. ఇప్పుడు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు.
బస్సు అతి వేగంగా వెడుతుండటంతో.. ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
రెండు మూడు రోజుల కిందట ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకార దాడులకు దిగింది పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుంటూ వెళ్లేలా అధునాతన డ్రోన్లతో తాలిబన్ దళాలు విరుచుకుపడ్డాయి.
Publish Date:Jun 30, 2026
ఈ బోర్డులో మెగాస్టార్, ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు ప్రభుత్వం చోటు కల్పించింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సురేఖ నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.