అమెరికాతో ముఖాముఖి చర్చలకు ఇరాన్ నో!

Publish Date:Apr 25, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు మరో సారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నియమించిన ప్రత్యేక ప్రతినిధులతో   ముఖాముఖి చర్చలకు ఇరాన్ నో చెప్పింది. పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఈ శాంతి చర్చల్లో  పాల్గొనేది లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది.  అగ్రరాజ్యం తన పాత షరతులనే మళ్లీ తెరపైకి తేవడం పట్ల  తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఇరాన్.. ఈ పరిస్థితుల్లో చర్చల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని తెగేసి చెప్పింది.

మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది.  తాము చెప్పదలచుకున్న విషయాలను   పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది. 

అదలా ఉంటే.. అమెరికా తన పట్టు విడ వటం లేదు. ఇరాన్ చర్చలకు సిద్ధమైనప్పటికీ, తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ఏదైనా ఒప్పందం కుదురుతుందని అగ్రరాజ్యాధినేత చెబుతున్నారు.  ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవాలని, హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు  ఆటంకం కలిగించకూడదని అమెరికా   డిమాండ్ చేస్తోంది. ఈ షరతులకు ఇరాన్ సమ్మతి తెలిపితేనే చర్చలు సఫలమవుతాయనీ, ఒప్పందం కుదురుతుందని అమెరికా చెబుతోంది.

ఈ నేపథ్యంలో ఇరాన్ పరోక్ష చర్చలు అనడం అమెరికా వైఖరిపట్ల అపనమ్మకంతోనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ట్రంప్ తన ప్రకటనల్లో తరచుగా ఇరాన్ పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించడం, ఇరాన్ నౌకలపై దాడులకు ఆదేశాలు ఇవ్వడం వంటి పరిణామాలు ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి.  దీంతో ఈ ప్రతిష్ఠంభన ఇప్పట్లో తొలిగే సూచనలు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
అమెరికా సైనిక పాటవానికి, అత్యాధునిక నిఘా సాంకేతికతకు నిదర్శనంగా నిలిచే శక్తిమంతమైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ వ్యవస్థపై ఇరాన్ దాడి తీవ్ర ప్రభావాన్ని చూపింది. అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ డ్రోన్ల బలగంలో  25 శాతం డ్రోన్లు ధ్వంసమయ్యాయి.
 తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్   నిర్మిస్తున్న  విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో   కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో  టన్నెల్ పైభాగం నుంచి భారీ కొండచరియలు  విరిగిపడ్డా
ది న్యూయార్క్ టైమ్స్ అమరావతి నిర్మాణం, పురోగతి, ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సామాజిక ఖాతా ద్వారా షేర్ చేశారు.
సర్ కారణంగా తన ఒక్కడి ఓటే కాదు.. బెంగళూరు వ్యాప్తంగా  65 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని ఆధారాలతో సహా ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. 
గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేదికగా భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయ
హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..!
ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.