కిందపడ్డా పై చేయి మాదే అంటే ఎలా సారూ.. ట్రంప్ కు ఇరాన్ షాక్

Publish Date:Mar 25, 2026

Advertisement

ఓటమిని విజయంగా చిత్రీకరించుకునేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందంటూ ఇరాన్ ఎద్దేవా చేసింది. తాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ చేసిన ఐదు రోజుల యుద్ధ విరామ ప్రకటనను, 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఎద్దేవా చేస్తూ ఇరాన్ అమెరికాది ద్వంద్వ నీతి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

ఘోర ఓటమిని దౌత్య విజయం(డిప్లమాటిక్ సక్సెస్)గా కలర్ ఇస్తోందని దుయ్యబట్టింది.    అమెరికా తన అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలతో ఇరాన్ దాడులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైందనీ, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి శాంతి చర్చలు,  దౌత్య విజయం  అంటూ కొత్త నాటకానికి తెర లేపిందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఎండగట్టారు. ఇరాన్ ప్రయోగించిన అత్యంత వేగవంతమైన క్షిపణులు అమెరికా రక్షణ కవచాలను ఛేదించి మరీ లక్ష్యాలను తాకాయనీ, దీంతో అమెరికా డిఫెన్స్ లో పడిందనీ ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ముందు పరువు కాపాడుకోవడానికి ట్రంప్.. ఈ ఘోరపరాభవాన్ని, పరాజయాన్ని ఒక విజయంగా చెప్పుకోవడానికి నానా తంటాలూ పడుతోందన్నారు. 

హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకల వెనకడుగును, తమ ఎఫ్-35 విమానాల వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.  
అమెరికా ఒకవైపు శాంతి ప్రణాళికలను పంపిస్తూనే, మరోవైపు ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఈ ద్వంద్వ వైఖరిని తాము సహించబోమని, తమ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  అమెరికా తన అబద్ధపు ప్రచారాలను ఆపకపోతే, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగి అమెరికా   ఉనికికే ముప్పు తప్పదని హెచ్చరించారు.

అదలా ఉంటే..  అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణితో దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ససాక్ష్యంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. అయితే ఈ దాడిని అమెరికా ఇంకా ధృవీకరించాల్సి ఉంది.   యూఎస్ఎస్ అబ్రహం లింకన్  విమాన వాహక నౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నానమీ, ఆ నౌక లక్ష్యంగా దాడులు చేస్తామని ప్రకటించిన గంట వ్యవధిలోనే ఇరాన్ దాడి చేయడం గమనార్హం. ఇరాన్ దాడిలో  యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహన నౌక బాగా దెబ్బతిందని కూడా ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది.  

అదలా ఉంటే.. యుద్ధ విరమణ అంటూ  అమెరికా చేసిన దౌత్య ప్రయత్నాలకు ఇరాన్ హెచ్చరిక గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.  కాల్పుల విరమణ కోసం అమెరికా పంపిన 15 సూత్రాల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాకిస్థాన్, ఈజిప్టుల మధ్యవర్తిత్వంతో అమెరికా తన శాంతి ప్రణాళికను ఇరాన్ కు పంపింది. అయితే ఇరాన్ మాత్రం యుద్ధం ఎప్పుడు, ఎలా ముగించాలో తానే నిర్ణయించుకుంటానని స్పష్టం చేసింది. ఇరాన్ శాంతి ప్రణాళిక మోసపూరితమనీ, తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదిలా ఉందనీ కుండబద్దలు కొట్టింది.  

అంతే కాదు.. అమెరికాకు నిజంగా శాంతి కావాలనుకుంటే.. తమ షరతులకు అంగీకరించాలని పేర్కొంది. యుద్ధ విరమణకు ఇరాన్ ఐదు షరతులు విధించింది. ఇరాన్ పై దాడులను పూర్తిగా నిలిపివేయాలనీ, అలాగే యుద్ధం పునరావృతం కాదన్న స్పష్టమైన హామీ ఇవ్వాలనీ, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలన్న డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది. అంతే కాకుండా, దౌత్యపరంగా చర్చలు జరుగుతున్న సమయంలో కూడా తాము దాడులను ఆపేది లేదని విస్ఫష్టంగా తేల్చి చెప్పింది.  

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం విజయ్ కీలక భేటీ
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.