రైజింగ్ ... రైజింగ్ ... సన్ రైజింగ్ ....

Publish Date:Apr 5, 2013

Advertisement

 

ఐపిఎల్-6 ముచ్చటగా మూడో మ్యాచ్ సన్ రైజర్స్ x పూణే వారియర్స్ మధ్య హైదరాదాబ్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగింది. గత సీజన్ లో హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ పేరుతొ ఆడిన టీం ఎనిమిదవ స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ పేరు మార్పుతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ శుభారంభం చేశారు. పూణే వారియర్స్ టాస్ గెలిచి సన్ రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు పార్థివ్ పటేల్, అక్షిత్ రెడ్డి సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పార్థివ్ పటేల్ దూకుడుగా ఆడుతున్న సమయంలో అశోక్ దిండా వేసిన చక్కటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పార్థివ్ పటేల్ 19 పరుగులు చేసి అవుటయ్యాడు. అక్కడినుండి ఆట మందకొడిగా సాగింది. కెప్టెన్ సంగక్కర వికెట్ కాపాడుకునే క్రమంలో నింపాదిగా ఆడుతూ వచ్చాడు. నిలదొక్కుకుంటాదనుకున్న సంగక్కరను(15) రాహుల్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓపెనర్ అక్షిత్ రెడ్డి(27) యువరాజ్ సింగ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో పెరీరా దూకుడుగా ఆడి 30 పరుగులు చేసిన తరువాత దిండా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సన్ రైజర్స్ ఇన్నింగ్ లో మిగతా బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెమరూన్ వైట్ 10, విహారి11, ఆశిష్ రెడ్డి  7 నాటౌట్, రవితేజ 4 నాటౌట్ గా నిలిచారు. సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. తక్కువ స్కోరు చేదించవలసిన పూణే వారియర్స్ 18.5  ఓవర్లలోనే 104 పరుగులు చేసి కుప్పకూలింది. ఒకే ఓవర్లో 6 x 6 కొట్టిన యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. అతను కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్ ను రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే లు ప్రారంభించారు. ఊతప్ప దూకుడుగా ఆడుతుండటంతో పూణే వారియర్స్ విజయం తథ్యమని అందరూ భావించారు. కానీ సన్ రైజర్స్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేశారు. మిశ్రా 3 వికెట్లు, స్టెయిన్ 3 వికెట్లు, పెరీరా 2 వికెట్లు పడగొట్టారు. పూణే వారియర్స్ ఇన్నింగ్స్ లో ఊతప్ప 24పరుగులు, మనీష్ పాండే 15 పరుగులు, శామ్యూల్స్ 5 పరుగులు, యువరాజ్ సింగ్ 2 పరుగులు, రాస్ టైలర్ 19 పరుగులు, నాయర్ 19 పరుగులు,  మాథ్యూస్ 8 పరుగులతో నాటౌట్, మిచెల్ మార్ష్ 7 పరుగులు, భువనేశ్వర్ 3పరుగులు, రాహుల్ 0 పరుగులు, దిండా 0 పరుగులు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అమిత్ మిశ్రా నిలిచాడు.

By
en-us Political News

  
వెంకన్న దేవుడి సొమ్ము స‌రే కాజేయాల‌న్న ఆలోచ‌న కొద్దీ.. కొంద‌రు అవినీతి ప‌రులు ప్రతి చిన్న విష‌యానికీ.. పెద్ద పెద్ద టెండ‌ర్లు వేసి శ్రీవారి సొమ్ము ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు.
ఇంతకీ మెస్సీ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే? గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లెస్సీ భారత్ లోని నాలుగు ప్రధాన నగరాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. ఇంతకీ గోట్ అంటే ఏమిటి అంటారా గోట్ అంటే గ్రేటెస్ట్ ప్లేయర్ ఆప్ ఆల్ టైమ్.
పాపులర్ ఫ్రాంచైజీలు.. చేతులు మారనున్నాయ్. అసలు.. ఐపీఎల్ స్వరూపమే మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. జరుగుతున్న పరిణామాలు, కనిపిస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయ్.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, 2014 ఎన్నికలకు ముందు ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్య కేసు విచారణ అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది.
మెస్సీతో మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకోవడానికి, రాష్ట్రంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయడానికి ఈ మ్యాచ్ దోహదపడుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్ లో గూగూల్ ఫర్ స్టార్టప్ హబ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలను ప్రకటించారు. ప్రభుత్వ ప్రోత్సహకాలను వినియోగించుకుని స్టార్టప్ లు భవిష్యత్ లో గూగుల్ వంటి సంస్థలుగా విస్తరించాలని పిలుపునిచ్చారు.
మావోయిస్టుల పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ మన్యంలో సంచలనం రేపాయి. మావోయిస్టుల సంచారం పెద్దగా కనిపించని అల్లూరి మన్యంలో ఇటీవల ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ మావోయిస్టులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పాలన ఉండాలని నిర్దేశించారు. ఆన్ లైన్ సేవలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చాలన్నారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దుతో ఎనిమిది రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినందుకు 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలంటూ సంస్థ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌, సీవోవోలకు డీజేసీఏ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో ఒక్క పవర్ సెక్టార్‌లోనే 3 లక్షల 24 వేల 698 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించారంటూ ఆ బ్యాంక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఏసీపీ మునావర్‌పై అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో జోక్యం, కొన్ని కేసుల్లో అనచితంగా వ్యవహరించారన్న పలు ఫిర్యాదులు అందడంతో సిపి సజ్జనార్ పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తాను తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటబుల్ అంటున్నానని చెప్పారు. చైనాలోని గ్వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాంగ్ ప్రావిన్స్ మోడల్ ఆధారంగా తెలంగాణ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.