పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు

Publish Date:Apr 14, 2013

Advertisement

 

ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిలకడైన బ్యాంటింగ్ తో తక్కువ స్కోరును ఛేదించి గెలుపు సొంతం చేసుకుంది. టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ 10 ఓవర్లలో కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్ శ్రీశాంత్ వేసిన రెండో ఓవర్లో పంజాబ్ కెప్టెన్ ఆడమ్ గ్రిల్ క్రిస్ట్ (0), మన్ దీప్ (2) పరుగుల చేసి ఔటయ్యారు. మరుసటి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించిన వోహ్రా (3) రనౌట్ అయ్యాడు. మైఖేల్ హస్సీ, గురుకీరత్ లు నిలకడగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 31 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ ఇన్నింగ్స్ లో హస్సీ (41) ఒక్కడే అత్యధిక స్కోరు చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో ప్రవీణ్ కుమార్ 7 బంతుల్లో 15 పరుగులు (2ఫోర్లు,  1 సిక్స్) చెలరేగి ఆడడంతో పంజాబ్ 124 పరుగులైనా చేయగలిగింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో గురుకీరత్ 10, సతీష్ 11,  అజార్ మెహమూద్ 23, చావ్లా 7, పర్మిందర్ ఆవానా 0, హారీస్ 2 నాటౌట్ గా నిలిచాడు. శ్రీశాంత్ 2, కెవోన్ కూపర్ 2, ఫాల్కనర్ 2, తివేది 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ వాట్సన్ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. వాట్సన్ 19 బంతుల్లో 32 పరుగులు (7 బౌండరీలు) చేసిన తరువాత ఆవానా బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ద్రావిడ్ 9,  బిన్నీ 0 లను ప్రవీణ్ కుమార్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. ఒక పక్క వికెట్లు పడిపోతున్నా ఓపెనర్ రహానే నిలకడగా ఆడుతూ రాజస్థాన్ రాయల్స్ ను నాలుగు బంగులు మిగిలి వుండగానే 126 పరుగల విజయలక్ష్యాన్ని ఛేదించాడు. హాడ్జ్ 15, శ్యామ్ సన్ 23 బంతుల్లో 27 పరుగులు (3 బౌండరీలు)తో అజేయంగా నిలిచాడు. రహానే 42 బంతులలో 34 పరుగులు (3బౌండరీలు) లతో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ప్రవీణ్ 2, ఆవానా 1, పియూష్ చావ్లా 1 వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫాల్కనర్ నిలిచాడు.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
సంక్రాంతి పండుగ వేళ ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు
పులికాట్ సరస్సు వద్ద సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీ ఎంపీల పనితీరు శాతంలో ఎంత పెరుగుదల ఉందో తెలీదు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళ మండి పడ్డారు. తనకు అనుమతిస్తే యూట్యూబర్ అన్వేష్ ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొచ్చి పడేస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.
వైసీపీ మీడియా ప్రతినిధులతో పాటు తిరుపతిలోని వైసీపీ నేతలే ఈ కుట్రను అమలు చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కమాండ్ కంట్రోల్ తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలు పరిశీలించారు.
విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీలు అయ్యారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.