డమ్మీ గన్ తో బెదరించి..గొడ్డలితో దాడి చేసి బంగారం దోపిడీ!

Publish Date:Jan 3, 2026

Advertisement

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు డమ్మీ గన్‌తో బెదిరించి, షాప్ యజమానిపై గొడ్డలితో దాడి చేసి నాలుగు తులల బంగారం దోచుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన షాప్ యజమాని సందీప్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 

రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్  షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో  షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. అనంతరం షాప్‌లో ఉన్న బంగారు బాక్స్‌లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు.

పరిస్థితిని గమనించిన సందీప్ ధైర్యంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులలో ఒకడు తన వద్ద ఉన్న గొడ్డలి లాంటి పదునైన ఆయుధంతో సందీప్ తలపై బలంగా దాడి చేశాడు. ఒక్కసారిగా జరిగిన దాడిలో  సందీప్ తీవ్రంగా గాయపడి రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగులు   నాలుగు తులల బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. ఓనర్ తీవ్రంగా ప్రతిఘటిం చడంతో వారు ఉపయో గించిన డమ్మీ గన్‌ను అక్కడే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.అరుపులు, గట్టి గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు లోపలికి వచ్చి చూడగా.. సందీప్ రక్తం మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు  కీసర పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని  సందీప్‌ను తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  

కాగా దోపిడీ జరిగిన షాప్ పరిసరాలను, దుండగులు ప్రవేశించిన మార్గాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు.  నిందితులు వదిలేసిన డమ్మీ గన్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. షాప్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. దుండగుల్ని పట్టుకునేందుకు ఎస్‌వోటీతో పాటు స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ దోపిడీ ఘటనతో నాగారం, కీసర పరిధిలోని వ్యాపార వర్గాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. ముఖ్యంగా జ్యువెలరీ షాప్‌ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే ఇలాంటి ఘటన జరగడం కలవరపెడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
రెండో విడతలో భాగంగా బుధవారం యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. మొత్తం ఏడు గ్రామాల్లో దశలవారీగా అమలు చేయనున్న ఈ కార్యక్రమం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాలలో కొనసాగుతుంది.
శాస్త్రోక్తంగా పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలకు అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం అర్ధరాత్రి నిర్వహించే ఏకాంత సేవ సమయంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తర ద్వారాలను అధికారికంగా మూసివేయనుంది.
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రాజెక్టు పనులు ఇప్పటికే 88 శాతం మేర పూర్తి అయ్యాయి.
ఐసీసీ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చి ఆడాల్సిందేనని, లేకుంటే ఆయా మ్యాచ్‌ల పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఈ సంస్థ వలలో పడి 1,044 మంది మోసపోయినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఎల్బీఎఫ్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికులని తేలింది. ఈ సంస్థపై కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోకూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 48 గంటలలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఆ వెంటనే కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ, బీఆర్ఎస్ ద్వారా తనకు లభించిన శాసనమండలి సభ్యత్వానికి కూడా అప్పుడే రాజీనామా చేశారు. ఆ రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పుడు ఆమోదించారు.
బ్లో ఔట్ కారణంగా ఎగజిమ్ముతున్న మంటలను ఒకే సారి నియంత్రిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, అందుకే దశలవారీగా మంటల అదుపునకు ప్రయత్నాలు చేస్తున్నామనీ ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.
పోలీసులు పలు క్లబ్లులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే 13 ముక్కల పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ భీమవరం పట్టణంలోని కొన్ని క్లబ్బులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.
టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.