కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ కార్యకర్తలు!!

Publish Date:Dec 28, 2019

Advertisement

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆగ్రహంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు కార్యకర్తలు నిప్పు పెట్టి తగులబెట్టారు. కల్లూరు మండలం, తాండ్రపాడు గ్రామంలో నాడు- నేడు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. ఇందిరా గాంధీ కాలనీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యేని తమ కాలనీకి రావాలని ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లకుండా పక్కకాలనీ లోకి వెళ్లారు. దీంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఎమ్మెల్యే ప్లెక్సీలను దగ్ధం చేశారు. కొత్తగా పార్టీ లోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని.. కొన్నేళ్లుగా పార్టీలో ఉంటున్న తమను పట్టించుకోవడం లేదని పాత క్యాడర్ విమర్శిస్తోంది. ఈ ఘటన జిల్లా వైసీపీలో పెను దుమారమే రేపింది. జిల్లాలోని ముఖ్య నేతలు జోక్యం చేసుకొని తాండ్రపాడులో ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కార్యకర్తలతో.. కొత్తగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడి అందరి మధ్య రాజీ కుదిర్చి వివాదానికి తెరదించినట్లు సమాచారం. 

ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ కి మాజీ ఎమ్మెల్యేలు మురళీ కృష్ణ , మణిగాంధీ మధ్య వైరం ఉంది. ముగ్గురు నేతలు ఎవరి దారిలో వారు వెళ్తున్నారు. దీంతో కోడుమూరు వైసీపీ క్యాడర్ లో చీలికలు ఏర్పడ్డాయి. చివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా ముగ్గురు కలిసి పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. కోడుమూరు నియోజక వర్గం వైసీపీ ఇన్ చార్జి కోట్ల హర్షవర్దన్ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల నాటి నుంచి సుధాకర్ కు దూరంగా ఉన్నారు. అయితే పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం ఇద్దరూ రాజీకొచ్చి జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వీరి క్యాడర్ కూడా ఏకమయ్యారు. అయితే ఎమ్మెల్యే సుధాకర్ తో కలిసి పని చేసేందుకు మాజీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు వర్గపోరును వీడకపోవడంపై చర్చ జరుగుతోంది. వీరి వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు.

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.