Publish Date:Dec 28, 2019
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున మెజార్టీ సీట్లు గెలవాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పర్సనల్ ఎజెండాపై వీరు గెలిచారు అనే వాదన ఉంది. దీంతో ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి తమ సత్తా చాటాలని ఈ నేతలు భావిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలు కరీంనగర్ ఎంపీ సంజయ్ కు మరింత కీలకంగా మారాయి.
మోదీ హవా..సంజయ్ ఇమేజ్ తో.. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు జరిగే మునిసిపల్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని సంజయ్ భావిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మినహా ఎక్కడా బీజేపీ పెద్దగా సీట్లు సాధించలేదు. కౌన్సిలర్ నుంచి ఎంపీగా విజయం సాధించిన సంజయ్ పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తామని ధీమా బీజేపీలో కనిపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి మొన్నటి ఎన్నికల్లో కాలం కలిసొచ్చింది. పసుపు బోర్డు విషయం తేలక పోవడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనితో ఈ సారి ఆయన లోకల్ సెంటిమెంట్ ప్లే చేసే పనిలో పడ్డారు. కార్పొరేషన్ గెలిస్తే నిజామాబాద్ పేరు మారుస్తామని ప్రచారం చేస్తున్నారు. అయితే లోకల్ సెంటిమెంట్ అరవింద్ కు కలిసి వస్తుందా లేదా అనేది ప్రశ్నగా మారింది.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తుడుం దెబ్బ అధ్యక్షుడు, ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బిజెపికి మారిన ఆయన ఆదివాసీ సెంటిమెంట్ తో ఎంపీ అయ్యారు. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ లో బలమైన ఓటు బ్యాంకు సోయం సొంతం. లోకల్ ఎలక్షన్స్ లో పట్టుమని పది సీట్లు కూడా బీజేపీ గెలవలేకపోయింది. అయితే ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సోయం బాపురావు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన మూడు నియోజక వర్గాల నుంచి ఎంపీలుగా తెచ్చిన ఈ ముగ్గురు నేతలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సానుకూల ప్రకటనలకు తీసుకోలేక పోయారు. విమర్శలను ఎదుర్కొని.. ఈ ముగ్గురు ఎంపీలు మునిసిపాలిటీల్లో ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ahead-of-telangana-civic-polls-bjp-aims-to-add-to-gains-in-lok-sabha-elections-25-92642.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.