సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నో

Publish Date:Oct 16, 2025

Advertisement

కర్నాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకుడు నారాయణ మూర్తి నిరాకరించారు. ఆయనతో పపాటు ఆయన సతీమణి, రచయిత్రి, సామాజిక ఉద్యమ కారిణి సుధామూర్తి కూడా ఈ సర్వేలో పాల్గొనేది లేదని కుండబద్దలు కొట్టారు. తాము ఏ వెనుకబడిన వర్గానికీ చెందిన వారం కాదనీ, అందుకే ఈ సర్వే వల్ల ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదనీ పేర్కొన్న వారు అందుకే సర్వే కోసం తమ ఇంటికి వచ్చిన అధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చి మరీ తమ అనంగీకారాన్ని తెలిపారు. సర్వే ఫారంపై కూడా వారీ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.  

ఇలా ఉండగా ఈ సర్వే ప్రారంభమైన తొలి వారంలోనే పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సర్వేలో పాల్గొనాలని అధికారులు, ఉపాధ్యాయులు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.   సర్వేలో పాల్గొనబోనని చెప్పినా పర్వే చేయడానికి వచ్చిన వ్యక్తి బెదరింపులకు దిగుతున్నారని పలువురు ఆరోపణలు గుప్పించారు. అన్నిటికీ మించి సర్వే పట్ల ప్రజల విముఖతకు ప్రధాన కారణంగా   ప్రశ్నలు చాలా ఎక్కువగా, విసుగు తెప్పించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి డీకేశివకుమార్ కూడా సర్వే కోసం ఉద్దేశిచిన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉందనీ, విసుగుతెప్పించేవిగా ఉన్నాయనీ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా.. ప్రశ్నల సంఖ్యను తగ్గించి, సర్వే ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.  

నగరాల్లో నివశించే ప్రజలకు అన్నేసి ప్రశ్నలకు అంతంత సేపు సమాధానం చెప్పే ఓపిక, తీరిక ఉండదని డీకే అన్నారు.  ఇక ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు సర్వేలో పాల్గొనడానికి   నిరాకరించడం పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమన్న డీకే శివకుమార్  సర్వేలో పాల్గొని తీరాలని తాము ఎవరిపైనా ఒత్తిడి తేబోమని స్పష్టం చేశారు.   రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85.89 శాతం సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతున్నా, గ్రేటర్ బెంగళూరు పరిధిలో మాత్రం కేవలం 19.62 శాతమే పూర్తి కావడం గమనార్హం. ఇది నగరంలో సర్వే ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతోంది.

By
en-us Political News

  
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది.. కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు.
జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులను వర్చువల్‌గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్యనే ఉంచాలని నిర్ణయించింది.
సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కమిటీ బాధితుల వివరాలను పరిశీలించి, సకాలంలో వారికి చెల్లింపులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన పరీక్షల్లో ఇటువంటి అవకతవకలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.
ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీని ఆశ్రయించి భక్దులకు సులభంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన చర్యల వల్ల ఇప్పడు భకులకు మరీ జాగు లేకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. భక్తులకు జాగు లేకుండా స్వామివారి దర్శనం లభిస్తుండటంతో కొండపై వసతి లభ్యత కూడా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది.
ముందస్తు బెయిల్ పిటిషన్ లో దాఖలైన మధ్యంతర రక్షణ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు వాదనలు విన్నది.
కరువు భత్యాన్ని (డీఏ) పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూమ్‌లో ఉన్న ఫర్నిచర్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంట లను అదుపులోకి తీసుకు వచ్చారు.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శక పరిచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక అడుగు వేసింది.
రాయల్ బాటిళ్లలో లోకల్ మద్యం నింపి, ప్రీమియం లిక్కర్ పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను టార్గెట్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.