జయహో ఇస్రో

Publish Date:Feb 14, 2017

Advertisement

పేదరికం, అవినీతి, కుటుంబపరిపాలన, కులం పిచ్చి, నిస్తేజమైన ప్రభుత్వ యంత్రాంగాలు, నిర్వేదాన్ని కలిగించే న్యాయవ్యవస్థ... భారతదేశం అన్న పేరు వినగానే చాలామందికి గుర్తుకువచ్చేవి ఇవే! ప్రత్యేకించి ఏమన్నా గొప్పగా చెప్పుకోవాలన్నా వేల సంవత్సరాల క్రితపు చరిత్రను భుజానికి ఎత్తుకోవాల్సిందే. కానీ మన దేశం గురించి చెప్పుకొనేందుకు ఏముంది అన్న బాధ కలిగిన ప్రతిసారీ... భారతీయులు తల ఎత్తుకునేలా చేసిన సంస్థ ఇస్రో.

 

 


ఇస్రో ఏర్పడి ఇప్పటికి దాదాపు 50 ఏళ్లు పూర్తికావస్తోంది. ఏదో మిగతా దేశాల్లాగా ఇండియా కూడా తూతూమంత్రంగా ఓ అంతరిక్ష సంస్థని ఏర్పాటు చేసిందిలే అని ప్రపంచమంతా భావించింది. కానీ 1975లోనే ఆర్యభట్ట పేరుతో తొలి భారతీయ ఉపగ్రహాన్ని నిర్మించింది ఇస్రో. వేల ఏళ్లనాటి మన విజ్ఞాన స్ఫూర్తి ఇంకా చెక్కుచెదరలేదని నిరూపించింది. అది మొదలు ప్రపంచాన్ని ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది.

 

 


దక్షిణాసియాలో సమాచార వ్యవస్థకు కొత్త అర్థాన్ని ఇచ్చిన INSAT ఉపగ్రహాలు (1983), ఉపగ్రహాలను సమర్థవంతంగా ప్రయోగించగల PSLV వ్యవస్థ, మన దేశానికి తనదైన నావిగేషన్‌ వ్యవస్థను అందించగల NAVIC ఉపగ్రహాలు... ఇలా ఏటికేడు ఇస్రో అందిస్తూ వచ్చిన అద్భుతాల జాబితా చాలా పెద్దదే. అరకొర సదుపాయాలతో, చాలీచాలని నిధులతోనే మంగళయాన్‌, చంద్రయాన్‌ వంటి భారీ ప్రణాళికలను సైతం సాకారం చేయగలిగారు.

 

 


ఇస్రో ఏదన్నా ప్రయోగాన్ని చేసిన ప్రతిసారీ... ప్రపంచంలో ఇది రెండోసారి, నాలుగోసారి అంటూ లెక్కలు వేసేవారు. కానీ ఈసారి ఇస్రో అంతకుమించిన అద్భుతాన్ని ఆవిష్కరించే సాహసం చేయనుంది. ఇప్పటివరకూ ఎవరూ సాధించని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. వీటిలో మూడు ఉపగ్రహాలు మాత్రమే మనవి కావడం విశేషం. మిగతా ఉపగ్రహాలన్నీ ఇజ్రాయేల్‌, నెదర్లాండ్స్, స్విట్జర్‌లాండ్‌ వంటి దేశాలవి. ఇక ఏకంగా 96 ఉపగ్రహాలు అమెరికానుంచే వచ్చాయంటే మన ఇస్రో ప్రతిష్ట ఎంత ఎత్తున ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేర్చడం ద్వారా ఇస్రో కావల్సినన్ని నిధులను కూడా సేకరించగలుగుతోంది.

 

 

ఒకవైపు విదేశీ ఉపగ్రహాలను చేరవేస్తూనే మరోవైపు మన దేశ అవసరాల కోసమూ మూడు ఉపగ్రహాలను పంపుతోంది ఇస్రో. వీటిలో Cartosat-2 అనే ఉపగ్రహం మన శత్రువుల కదలికలను గమనించగల అద్భుతమైన సాధనం. మరో రెండు ఉపగ్రహాలేమో క్లిష్టమైన నానో టెక్నాలజీ సాయంతో రూపొందించినవి. ఇలా ప్రయోగించే సంఖ్యలోనే కాదు, అందులో ఉన్న ఉపగ్రహాల విషయంలో కూడా ఈ ప్రయోగం కీలకమైనదే! ఇన్ని ఉపగ్రహాలనూ ఒక్కసారిగా మోసుకువెళ్లడం, వాటిని వేర్వేరు కక్ష్యలలో ప్రవేశపెట్టడం అంటే మామూలు విషయం కాదు. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రవేశపెట్టగానే ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది. ఆ సంఖ్యని మించి ఉపగ్రహాలను పంపడం మరోసారి సాధ్యం కాదనుకుంది. కానీ భారత్‌ ఇప్పుడు అంతకు మూడురెట్ల అద్భుతాన్ని సాధించబోతోంది. ఇండియాలో మేధావులకు చోటు లేదనీ... కాస్తో కూస్తో బుర్ర ఉన్నవారంతా విదేశాలకు తరలిపోవాల్సిందే అని భ్రమించేవారి దిమ్మతిరిగేలా నిప్పులు చిమ్ముకుంటూ ఇస్రో అంతరిక్షంలో సరికొత్త అధ్యాయం సృష్టించబోతోంది.

By
en-us Political News

  
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.