ఉత్తర కొరియాకి భారత్ స్నేహ హస్తం!

Publish Date:Sep 16, 2015

Advertisement

 

ఇంచుమించు ప్రపంచ దేశాలన్నిటితో కూడా దక్షిణ కొరియాకి మంచి సత్సంబందాలున్నాయి. కానీ సైనిక పాలనలో కొనసాగుతున్న ఉత్తర కొరియాకి మాత్రం చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలతోనే సంబంధాలున్నాయి. భారత్-దక్షిణా కొరియాల మధ్య ఉన్నసత్సంబందాల కారణంగా భారత్ మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ ఫోన్లు మొదలుకొని కార్ల వరకు విస్త్రుత వ్యాపారావకాశాలను అందిపుచ్చుకొని లబ్ది పొందగలుగుతోంది. ఇది గమనించిన ఉత్తర కొరియా కూడా భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకొనేందుకు ప్రయాత్నాలు ప్రారంభించింది. గతేడాది ఏప్రిల్ నెలలో ఆ దేశ విదేశాంగ మంత్రి రి సు యంగ్ డిల్లీ పర్యటన చేసారు. భారత్ కూడా అందుకు చాలా సానుకూలంగానే ప్రతిస్పందించింది. ఇటీవల డిల్లీలో ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో నిర్వహించిన ఆ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిట్జు భారత ప్రభుత్వం తరపున హాజరయ్యారు.

 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇదేదో హడావుడిగా తీసుకొన్న నిర్ణయం కాదు. భారత్-ఉత్తర కొరియా దేశాల మధ్య మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలు బలపరుచుకొనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. మిగిలిన దేశాలలాగే ఉత్తర కొరియా కూడా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగి ఉంది. కనుక మిగిలిన దేశాలతో భారత్ ఏవిధంగా మైత్రిని కోరుకొంటుందో అదేవిధంగా ఉత్తర కొరియాతో కూడా స్నేహ సంబంధాలు కలిగి ఉండాలని భావిస్తోంది. గత సమస్యలను, అవరోధాలను అన్నిటినీ పక్కనబెట్టి ఉత్తర కొరియాతో మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పుకొనేందుకు మా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది,” అని అన్నారు.

 

ఉత్తర కొరియా భారత్ కంటే చైనా, పాకిస్తాన్ దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నందున భారత్ కూడా దానితో ఇంతకాలం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. కానీ మోడీ ప్రభుత్వం ఉత్తర కొరియాను దూరం పెట్టడం కంటే తన వైపు త్రిప్పుకోవడం మంచిదని భావించడంతో ఈ అడుగు వేసింది. మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి చైనా కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకవైపు భారత్ తో చర్చలు సమావేశాలు అంటూనే సరిహద్దుల వద్ద కాల్పుల అతిక్రమణకు పాల్పడుతూ, భారత్ లోకి ఉగ్రవాదులను ప్రవేశ పెట్టేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ ఒంటరి చేసేందుకే మోడీ ప్రభుత్వం ఉత్తర కొరియాతో స్నేహ సంబందాలు బలపరుచుకోవాలని ప్రయత్నిస్తోందేమో? లేకుంటే అమెరికా యూరప్ దేశాల దృష్టిలో దూర్తదేశంగా ముద్ర వేసుకొన్న ఉత్తర కొరియాతో స్నేహసంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేసి ఉండదు.

By
en-us Political News

  
మరో వైపు ఈ అంశంపై తన వాదనను తెలుగుదేశం కూటమి అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ స్పష్టంగా వినిపించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జగన్ హయాంలో జరిగిందన్న విషయాన్ని ఆధార సహితంగా సభ ముందుంచింది.
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.