పాకిస్తాన్ కు మనకన్నా ఒక్క రోజు ముందే స్వతంత్రం ఎందుకొచ్చింది?

Publish Date:Aug 14, 2017

Advertisement

 
ఆగస్ట్ 15, 1947న ఏం జరిగింది? ఈ ప్రశ్నకి భారతదేశంలో ఎవరైనా ఠక్కున సమాధానం చెప్పేస్తారు! డెబ్బై ఏళ్ల కింద ఆ రోజున మనకు స్వేచ్ఛ లభించింది! కానీ, విషాదంగా, బ్రిటీష్ వెళ్లిపోయిన అదే రోజున పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెంలా తయారై కూర్చుంది! ఆగస్ట్ 15, 1947నే ఆనాటి పాకిస్తాన్ కూడా ఏర్పాటైంది! ఆ దేశ మొదటి స్వాతంత్ర దినోత్సవం కూడా అదే నాడు జరిగింది! మరి ఇప్పుడెందుకు ఆగస్ట్ 14న… ఒక్క రోజు ముందే… పాక్ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది?

 

నిజానికి… పాకిస్తాన్ ఇండియాతో పాటే… ఆగస్ట్ 15న ప్రతీ యేడూ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. కాని, తన సెకండ్ ఇండిపెండెన్స్ డే నాటి నుంచీ ఆ దేశం భారత్ కంటే ఒక్క రోజు ముందుగా వేడుకలు జరుపుకుంటోంది! దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథే వుంది!

 

1947లో మనకు స్వాతంత్రం రావటానికి ముందు… 1945 ఆగస్ట్ 15వ తేదీన జపాన్ బ్రిటీష్ వారి ముందు లొంగిపోయింది! దాంతో రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసిపోయింది. అదే రోజున రెండేళ్ల తరువాత మనకు స్వతంత్రం ప్రకటించింది బ్రిటన్! ఆ దేశ అధికారిగా మన దేశంలో అప్పట్లో వున్నది మౌంట్ బ్యాటన్! వైస్రాయ్ గా వున్న ఆయన 1947లో … ఆగస్ట్ 15న జపాన్ పై బ్రిటీష్ విజయానికి సంకేతంగా జరిగిన వేడుకల్లో పాల్గొనాలని భావించాడు! అంతే కాదు, ఆగస్ట్ 15న న్యూ దిల్లీలో జరిగే భారత తొలి స్వతంత్ర వేడుకల్లోనూ పాల్గొనాలని భావించాడు! ఈ రెండు కారణాల చేత పాకిస్తాన్ కు ఒక రోజు ముందే, అంటే ఆగస్ట్ 14, 1947న స్వతంత్ర ప్రకటించేశాడు!

 

ఒక రోజు ముందే స్వేచ్ఛ లభించినా కూడా పాకిస్తాన్ 1947లో ఇండియాతో పాటే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంది. ఆ రోజు రంజాన్ నెల చివరి శుక్రవారం కూడా కావటంతో ప్రపంచ వ్యాప్త ముస్లిమ్ లు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని జిన్నా పిలుపునిచ్చాడు కూడా! కాని, మరుసటి సంవత్సరం పరిస్థితి మారిపోయింది! 1948లో ఆగస్ట్ 14 రంజాన్ నెల 27వ రోజైంది! అది ముస్లిమ్ లకు ప్రత్యేక పర్వదినం! అందుకని అదే రోజున సంబరాలు చేసుకున్నారు. ఇక అప్పట్నుంచీ ఆగస్ట్ 14ననే పాక్ స్వతంత్ర వేడుకలు జరగటం పరిపాటి అయిపోయింది!

 

భారతదేశం స్వతంత్ర దినోత్సవం జరుపుకునే రోజున పాకిస్తాన్ జరుపుకోకపోపవటానికి మరో కారణం కూడా వుంది! అది ఇండియానే! మనమంటే అస్సలు పడని పాకీలు మనతో బాటూ స్వతంత్ర వేడుకలు జరుపుకోవటం సహజంగానే ఇష్టపడరు! ఒకవేళ జరుపుకున్నా ప్రపంచం దృష్టి భారత్ వైపునే వుంటుంది! అందుకే, ఒక రోజే ముందే హంగామా చేసేస్తూ వస్తున్నారు 69ఏళ్లుగా… ఇస్లామాబాద్ పాలకులు!

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.