సోమశిల చేప విల విల

Publish Date:Jun 2, 2025

Advertisement

 

సోమశిల చేప విలవిలలాడుతోంది. చేపల వేట నిషేధ సమయంలోనూ అక్రమంగా చేపల వేట యథేచ్ఛగా కొనసాగుతుండటంతో నిజమైన మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. సైజు రాకుండానే చేపలను అక్రమ వేటగాళ్లు ఊడ్చేస్తుండటంతో మత్య సంపద ఖాళీ అవుతోంది.  అలివి  గాని చేపలవేటతో ఎదుగుదల లేకుండానే చేప పిల్ల బయటపడి ఎండిపోతోంది. నిషేధిత వలతో సోమశిల లో సైజుకు రాని చిన్న పిల్ల చేపలను సైతం ఊడ్చి వేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల నుండి ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు మండలాల పరిధిలోని సోమశిల బ్యాక్ వాటర్ లో యథేచ్ఛగా చేపల వేట సాగుతున్నా.. వాహనాల్లో చేపలను తరలిస్తున్నా అటు మత్స్యశాఖ అధికారులు కానీ ఇటు అటవీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  చేపల మాఫియాకు అడ్డు అదుపు లేకుండా  సాగుతోంది.  చేపల వ్యాపారులు కొందరు మాఫియాను తలపిస్తూ రోజుకు లక్షలాది రూపాయల మత్స్య సంపదను తోడేస్తున్నారు. 30 నుంచి 40 మందికి లైసెన్సులు ఉన్నట్టు తెలుస్తున్నా సోమశిల వెనక జలాల్లో వందల సంఖ్యలో వేటగాళ్లు జాతరను తలపించేలా చేపలవేట సాగిస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్ లో కి వెళ్లేందుకు అనుమతులు లేకున్నా  వాహనాలు వెళుతూనే ఉన్నాయి.  కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన వేటగాళ్లు చేపలు వేటాడితే ఆ చేపలను  వ్యాపారుల వాహనాల్లో బయటకు తరలిస్తున్నారు.

సోమశిల బ్యాక్ వాటర్స్ లో  చేపల  మాఫియా పిల్ల,పెద్ద చేపలన్న తేడా లేకుండా  వూడ్చేస్తోంది  చేపల వేటలో ఆరితేరి, అనుభవం కలిగిన కోస్తా జిల్లాలోని కాకినాడ,తుని తదితర ప్రాంతాల వేటగాళ్ళను  తీసుకొచ్చి మరీ మాఫియా చేపలవేట సాగిస్తోంది.  అలివి వల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ,  వీటితోనే  వేటాడుతుండడంతో   సైజుకు రాని చిన్న చేపలు, ఎదుగుదల లో ఉండే చేపలు సైతం బయట పడుతున్నాయయి. ఈ కారణంగా చేపలు పెద్దవి కాకుండా మత్స్య సంపదకు గండి కొడుతున్నారు . నలుసు లాంటి చేపలు అయితే  కుప్పలు కుప్పలుగా  పడేయడం, చిన్న చేపలను ఎండవేసి టన్నుల కొద్దీ  అమ్ముకోవడం జరుగుతుంది. 

 చేపలు పట్టే వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇచ్చే లైసెన్స్ లు జిల్లాలో 30 నుంచి 40 మందికి మాత్రమే ఉండగా వాటిని అడ్డుగా పెట్టుకుని వందల మందితో చేపల వేట కొనసాగిస్తున్నారు.  మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం 20 వేల రూపాయలు కోస్తా ప్రాంతంలో మత్స్య కారులు తీసుకుంటూ  ఇక్కడికి వచ్చి చేపలు పట్టడం జరుగుతుంది. 

జిల్లాలో ఉండే   లైసెన్స్ లు  కూడా చాలా మటుకు ఫోటోలు ఒకరివి  ఉంటే మరొకరి పేరు తో లైసెన్స్ ఉంటుందని సమాచారం.ఈ రకంగానూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఒక అధికారి వీటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడంతో తో కొందరు మళ్ళీ లైసెన్స్ లు  కోర్టు ద్వారా తీసుకున్నట్లు సమాచారం

చేపల మాఫియా దాటికి అసలైన మత్స్యకారులు  నానా కష్టాలు పడుతున్నారు. సోమశిల లో చేపలు ఎదిగితే  అవి వర్షాకాలంలో సగిలేరు. పెన్నా నదులు ప్రవహించేటప్పుడు నీటికి ఎదురెక్కి వస్తాయి. దీంతో వీటి  ప్రాంతాల పరివాహ ప్రాంత అడుగుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళి జీవనం సాగిస్తుంటారు.ప్రస్తుతం ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో చివరకు కూలీ పనులకు వెళుతున్నారు. 

సోమశిల బ్యాక్ వాటర్ లోని గోపవరం ,అట్లూరు , ఒంటిమిట్ట ,నందలూరు మండలాల్లో పెద్ద ఎత్తున చేపల వేట సాగుతోంది, గోపవరం మండలం లోని గట్టుపల్లి ,బ్రాహ్మణ ,ప్రాంతాలు అట్లూరు మండలంలోని బ్యాక్ వాటర్ ప్రాంతంలో చేపల మాఫియా కూలీలను తిష్ట వేయించి వేటాడిస్తోంది. ఒంటిమిట్ట మండలంలోని వెనుక జలాల్లో కూడా ఈ వేట ఎదేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెండు వారాల క్రితం గోపవరం మండలంలో  చేపలతో వెళుతున్న ఒక  వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకుని   ఫిషరీస్ శాఖకు అప్పజెప్పారు. అంతేకాదు నెల్లూరు రోడ్డు లో రెండు చోట్ల చెక్ పోస్టులు ఉన్నా కూడా ఈ చేపల వాహనాలు తిరుగుతూ ఉండడం గమనార్హం. 

చేపల మాఫియా రోజూ  టన్ను పెద్ద సైజు చేపలు వేటాడితే చిన్న చేపలు మరో టన్ను వరకు వేటాడుతున్నారు. ఇవి రెండు లక్షల రూపాయలు మేరకు విలువ చేస్తాయని చెప్పుకొస్తున్నారు .పెద్ద చేపలను కడప, కేరళకు, కలకత్తా లకు తరలిస్తుండగా ఎండు చేపలను అక్కడే ఎండబెట్టి విజయవాడకు తరలిస్తున్నారు. ఒక కేజీ ఎండు చేపలు రూ.130 ప్రకారం పచ్చి చేపలు అయితే 70 నుంచి 80 రూపాయలు వరకు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు   తెలుస్తోంది. ఇలా అడ్డూఅదుపు లేకుండా వేట సాగిస్తుండడంతో   సోమశిల మత్స్య సంపద మటుమాయం అయ్యే పరిస్థితి నెలకొంది. 

రిజర్వ్ ఫారెస్ట్ లోకి అనుమతి కుండా ఎవరూ ప్రవేశించకూడదు .అంతే కాదు రెవెన్యూ ఫారెస్ట్ లోకి కూడా అనుమతి లేకుండా  వాహనాలకు ప్రవేసించ కూడదు. అయితే రిజర్వుపారెస్ట్ నుంచే చేపల వాహనాలు తిరుగుతున్నా వాటిని అదుపు చేయడంలో ఫారెస్ట్ అధికారులు  విఫలమౌతున్నారు. గతంలో చేపల వేట మాటున  ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి.  చేపల రవాణా పేరుతో ఇప్పుడు కూడా వాహనాలు, వేటగాళ్లు తిరుగుతూ ఉండడంతో ఎర్రచందనం రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారింది.  

By
en-us Political News

  
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.