చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిస్తే వార్ వ‌న్‌సైడ్.. ర‌ఘురామ‌కృష్ణంరాజు

Publish Date:Aug 23, 2022

Advertisement

రాజ్యాధికారం చేజిక్కించుకోవ‌డానికి చాలాకాలం త‌ర్వాత పెద్ద చ‌ద‌రంగం ముందు కూచుని  ఇద్ద‌రు నాయ‌కులు ర‌ణ‌రంగం ఎలా న‌డ‌పాల‌న్న‌ది ఆలోచించారు. మ‌ర్నాడు ఇరువ‌ర్గాల సేన‌లు మ‌నం మ‌నం బ్ర‌ద‌ర్స్ మ‌న శ‌త్రువు మ‌న బాస్‌లు చెప్పేరుగా ఇక క‌త్తులు, క‌టార్లు సిద్ధం చేసుకోవ‌డ‌మే మ‌న ప‌ని అని యుద్ధానికి స‌మాయ‌త్త‌మ‌య్యారు. ఇది చాలా పాత‌కాలం యుద్ధ తంత్రంలో భాగంగా ఉండేది. ఇద్ద‌రి ఆలో చన‌లు క‌ల‌వాలేగాని అవ‌త‌లివాడు అధికారంలో ఉన్న పీఠం మీంచి అమాంతం కింద‌కు లాగేయ వ‌చ్చు. అందునా ప్ర‌జామోదం లేనివాడు, ప్రజాక‌ర్ష‌ణ కోల్పోయిన‌వాడ‌యితే మ‌రీ వీజీ. ఇపుడు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌రిస్థితి దాదాపు ఇదే సీన్‌. రానున్న ఎన్నిక‌ల‌కు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సార‌ధ్యం లోని టీడీపీ, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులు క‌లిపే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని విశ్లేష‌కుల మాట‌. ఒక‌వేళ అదే జ‌రిగితే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ్యాను కి విద్యుత్ అంద‌క నిలిచిపోయే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌నే  అంటున్నారు. ఎన్నిక‌ల్లో వీరి క‌ల‌యిక ప్ర‌భావం అమితంగా ఉండే అవ‌కాశాలే ఉన్నాయ‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు అనడం గ‌మ‌నార్హం. 

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే వార్ వన్  సైడేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తాను విస్తృత స్థాయి శాం పిల్స్ తో శాస్త్రీయంగా  జూన్, జులై మొదటి వారం వరకు నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 93 స్థా నాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న స్థానాల లో సగం స్థానాలో విజయం సాధించిన, ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వైయస్సా ర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం 7 నుంచి 8 కాగా, మరో మూడు నుంచి నాలుగు స్థానా లలో విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న 65 స్థానాలలో తమ పార్టీ ఒకవేళ 90% స్థానాలలో విజయం సాధించిన 73 సీట్లకే  పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.  

టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ చానల్ నిర్వహించిన సర్వేను చూసి తొడలు చర్చుకుంటూ ఇలాగే ప్రవర్తిస్తే, పరిస్థితి మరింత అద్వానంగా దిగజారే ప్రమాదం ఉన్నదని హెచ్చరిం చారు . సోమవారం(ఆగ‌ష్టు 23) రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు  మీడియాతో మాట్లాడుతూ,  జిల్లాల వారీగా సర్వే పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో పోటాపోటీగా తెలుగుదేశం,  వైఎస్సార్  కాం గ్రెస్ పార్టీలు తలపడే అవకాశం ఉన్నదన్నారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ  స్థానా ల్లో ఏక పక్ష విజయం సాధించనున్నదని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం అధికంగా ఉన్న దన్న ఆయన, గుంటూరులోనూ విజయ అవకాశాలను పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయగలరని  చె ప్పారు. టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే నువ్వా నేనా అన్నట్లు పోటీ  ఉన్న స్థానాలలో  ఆ రెండు  పార్టీల అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.   

ఇటీవల టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ ఛానళ్ళు బుల్లి,  బుల్లి శాంపిల్స్ తో సర్వే నిర్వహించి తమ పార్టీకి 18 నుంచి 23 లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడం తో, తమ పార్టీ నేతలు 175 కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని భావించి ఇంకా ఎక్కువ దారుణాలు చేయడం, సర్వే ఫలితాలను చూసి పనిచేయడం మానేస్తే పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుందని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ముఖచిత్రం బాగాలేదని తెలి సిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రధానితో భేటీలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బకాయి నిధులు చెల్లించాలని కోరినట్లుగా, అలాగే 10 వేల కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లిం చా లని అడిగినట్లుగా వివరించారని తెలిసిందన్నారు. కానీ ఏ మాత్రం క్రెడిబిలిటీ లేని వారికి పదివేల కోట్ల రూపాయలు అడ్వాన్సుగా ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక మెడికల్ కాలేజీల నిర్మాణానికి సహ కరించాలని ప్రధానిని  కోరినట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఎందుకంటే ఇప్పటికే శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణం పునాదుల దశలోనే ఉన్నాయని  గుర్తు చేశారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తమ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఇంటిని ప్రభుత్వం అకారణంగా కూల్చివేస్తే పరామర్శించడానికి వెళ్తుండగా అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు పరామర్శకు వెళ్తుంటే... ప్రభుత్వం ఎందుకని అంత దడదడలాడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పరామర్శల పేరిట ఊరూరు తిరిగిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు లోకేష్ తమ పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డగించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు ఐపీసీ ని ఫాలో కాకుండా, వైసీపీని ఫాలో అవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 

లోకేష్ ను మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, ఏక వచనంతో సంబోధించడం,  మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు వ్యతిరేకం కాదా? అం టూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. విశాఖలో చోటు చేసుకున్న సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని  ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వారి అందరి విశ్వా సాలను కోల్పోయే విధంగా తమ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే, ఎన్నో అబ ద్ధాలు చెప్పి, తటస్థ ఓటర్లను మనం  ప్రభావితం చేయగలిగి ఉండేవారమా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నిం చారు. 

మనస్సాక్షి లేని సాక్షి దినపత్రిక కోర్టులో జరిగిన వాదనలపై ఏమి రాస్తుందో చూడాలని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తాను దాఖలు చేసిన పిటీషన్ కొట్టేసినట్లు గతంలో యాక్ ..ఛీ దినపత్రిక, అదే పేరు ఉన్న ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ స్థానానికి  అదనపు సమాచారాన్ని అందించేందుకు అవకాశం ఇవ్వాలని తాము కోరగా, కోర్టు అంగీక రిం చిందని, తాము వీడియో ఆధారాలతో కూడిన అదనపు సమాచారాన్ని అందజేశామని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

By
en-us Political News

  
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.