Publish Date:Oct 10, 2022
భారత్ మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, పాకిస్తాన్ వికెట్కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తో భారత్ తలపడిన వన్డే సిరీస్ లో హర్మన్ ప్రీత్ అద్బుత ప్రతిభ కనపరచిన సంగతి తెలిసిందే. ఐసిసి సెప్టెంబర్ నెల అవార్డు పోటీలో భారత్ వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానాలను హర్మన్ అధిగమించింది. వాస్తవా నికి వారిద్దరూ గత టోర్నీల్లో ఎంతో అద్భుత ప్రతిభ కనపరిచారు.
నిగర్, స్మృతీతో పోటీపడి ఈ అవార్డు గెలుచుకోవడం గొప్ప ఆనందాన్నిస్తోందని హర్మన్ ప్రీత్ అన్నది. ఇంగ్లండ్లో ఇంగ్లండ్ మీద వన్డే సిరీస్ గెలవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నదగ్గ విజయమని, అందుకు ప్రజలు, క్రికెట్ అభిమానుల నుంచి ఇప్పటికే శుభాకాంక్షలు అందుకున్నామని భారత్ కెప్టెన్ అన్నది. 1999 తర్వాత ఇంతటి ఘన విజయం సాధించడం అదే మొదటిసారి కావడం విశేషం. పైగా కెప్టెన్ గా ఆమెకు ఎంతో ప్రత్యేకం. ఈ సిరీస్ లో ఆమె 103.27 స్ట్రయిక్రేట్తో 221 యావరేజ్తో అత్యధి కంగా 221 పరుగులు చేసింది.
ఐసీసీఅవార్డుల పోటీలో భారత్స్పిన్నర్ అక్షర్ పటేల్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్రీన్లను అధిగమిం చాడు పాక్ ఆల్రౌండర్ రిజ్వాన్. సెప్టెంబర్లో జరిగిన టి20 ల్లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించి అందరి దృష్టీ ఆకట్టుకున్నాడు. తన అవార్డును ఇటీవల పాకిస్తాన్లో భారీ వర్షాలకు కష్టాల్లో చిక్కుకున్న ప్రజలకు అంకితమిస్తున్నానని రిజ్వాన్ ప్రకటించాడు. సెప్టెంబర్లో పాక్ స్టార్ ఆడిన పది మ్యాచ్ల్లో ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. ఆసియాకప్లో హాంకాంగ్, భారత్ ల మీద విజృంభించా డు. టోర్నీలో అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు.
కాగా విజేతలు హర్మన్ ప్రీత్, రిజ్వాన్లు ఐసిసి నుంచి బంగారు పతకాలు అందుకుంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/icc-players-of-the-monthharmanpreet-25-145204.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.