గండిపేటలో 12 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

Publish Date:Jan 2, 2026

Advertisement

 

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని గంధంగూడ గ్రామంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా  కీలక చర్యలు చేపట్టింది. సర్వే నంబర్ 43 పరిధిలో ఉన్న 12.17 ఎకరాల ప్రభుత్వ భూమి క్రమంగా కబ్జాలకు గురవుతోందన్న స్థానికుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా స్పందించింది. భూమి ప్రభుత్వానికి చెందినదని నిర్ధారించిన అనంతరం శుక్రవారం ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి అక్రమ ఆక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంది.


గంధంగూడ గ్రామంలోని సర్వే నంబర్ 43లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారిక రికార్డుల్లో ఉంది. ఇందులో గతంలో ప్రభుత్వం ఒక ఎకరాను విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, మరో 9 ఎకరాలను జీహెచ్‌ఎంసీ చెత్త డంపింగ్ అవసరాల కోసం కేటాయించింది. ఈ కేటాయింపుల అనంతరం మిగిలిన భూమి క్రమంగా కబ్జా అవుతుందని స్థానికుల నుండి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారుల తో కలిసి హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టింది. 

భూమి ప్రభు త్వా నిదేనని స్పష్టంగా నిర్ధారించిన తరువాత, వెంటనే చర్యలు తీసుకో వాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాల మేరకు ఈరోజు శుక్రవారం 12.17 ఎకరాల భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ భూమిలో ఒక ఆలయం, ఒక మసీదు నిర్మాణం ఉండటంతో, వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మిగిలిన ప్రభుత్వ భూమిని రక్షించారు. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలియజేసేలా హైడ్రా బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

సుమారు రూ.1200 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని కాపాడడం ద్వారా హైడ్రా మరోసారి కబ్జాలపై తన కఠిన వైఖరిని చాటిందని అధికారులు తెలిపారు. ప్రజా ఆస్తుల రక్షణే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతుందని, ఎక్కడైనా ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరిగితే ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఈ ఘటనతో గంధంగూడ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రక్షణపై హైడ్రా చర్యలు చర్చనీయాంశంగా మారాయి.

By
en-us Political News

  
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది.
రాష్ట్రపతి భవన్‌లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ఉద్యాన్ ఉత్సవ్ రెండవ ప్రదర్శన జరగనుంది.
కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది.
న‌వ్యాంధ్ర‌లాంటి రాష్ట్రానికి అవ‌స‌ర‌మా? ఇంత‌కీ జ‌గ‌న్ పెట్టిస్తోన్న అన‌వ‌స‌ర ఖ‌ర్చులేవి? తాజాగా వెలుగులోకి వ‌చ్చినదేంటి?
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్‌పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు అయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.