మొదటి స్థానంలో ఉన్న దేశ రాజధానికి పోటీ పడుతుంది హైదరాబాద్ నగరం. కార్పొరేట్ కంపెనీల విషయంలోనే కాదు కాలుష్యం విషయంలో కూడా ఎక్కడా తగ్గటం లేదు. నగరం లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలతో భాగ్యనగర వాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి దీపావళి పండుగ అనంతరం నగరంలో ఉన్న గాలి నాణ్యత పై ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది దీపావళి రోజు నమోదయిన వాయు కాలుష్యం కంటే ఈ ఏడాది కాలుష్యం పెరిగిందని అందులో స్పష్టంగా తెలిపింది. గత ఏడాది హైదరాబాద్ లో కాలుష్యం 622మైక్రో గ్రాములు ఉండగా..ఈ ఏడాది 830 మైక్రో గ్రాములకు చేరిందని వెల్లడించింది.
ఇప్పటికే కాలుష్యం కారణంగా దేశ రాజధాని డేంజర్ జోన్ లో పడింది. ఢిల్లీలో మాస్క్ లేకుండా బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అవే పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రాబోతున్నాయి. గాలిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటితే ప్రమాదకరమని పీసీబీ చెబుతోంది. దీని ప్రకారం చూస్తే ఇప్పటికే నగరంలో చాలా చోట్ల ఈ పరిమితి దాటి పోవడంతో భాగ్యనగర వాసులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో ఉండే ప్రమాదకర సూక్ష్మ రేణువుల స్థాయిని బట్టి కాలుష్యాన్ని నిర్థారిస్తారు. గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5, 10 అని రెండు రకాల కాలుష్య కారక సూక్ష్మజీవులుంటాయి. పీఎం 2.5 అంటే 2.5 మిల్లీ మైక్రాన్ల మందం కలిగిన ప్రమాదకరమైన రేణువులు ఉంటాయి.. వీటినే దహన రేణువులు అని కూడా అంటారు. వస్తువులను కాల్చినప్పుడు గాలిలోకి చేరే మసి..లోహ కణాలు.. వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. పీఎం 10 అంటే 10 మిల్లీ మైక్రాన్ల మందం ఉన్న రేణువులు దుమ్మూ, ధూళీ, పూల పుప్పొడి, బూజు రేణువులు వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. 2.5 పీఎం అంటే పది కంటే అత్యధిక ప్రమాదకరం భాగ్యనగరం లో 720 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వద్ద 2.5 పీఎం వాయు కాలుష్య తీవ్రత నమోదైంది. దీని వలన ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో బయటకు రావడానికి కూడా కష్టం అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-air-most-polluted-after-delhi-25-90830.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.