Publish Date:Aug 18, 2022
కర్ణాటక, హసన్ జిల్లా. చిత్ర అనే ఆమె వాష్రూమ్కి వెళుతోంది. వెనగ్గా భర్త వచ్చి కొడవలితో మెడ నరికి చంపేశాడు. ఇదేదో క్రైం సినిమాలో సీన్ కాదు. నూటికి నూరుపాళ్లూ వాస్తవం. అప్పటిదాకా అక్కడివారు వాళ్లను గొడవలు మర్చిపోయి, కొత్త జీవితాన్ని గడిపేవారిగానే భావించారు. హమ్మయ్యా వారిద్దరూ కలి సేరు అనుకున్నారు రెండు కుటుంబాలవారూ, చిత్ర బంధువులు, కోర్టులో కోర్టు సీన్ చూసినవారు. కానీ ఆ ఆనందం ఆమెకు తాత్కాలికమైంది. ఆ క్షణం ఆమెకు ఆఖరిక్షణంగా మారు తుందని ఊహించలేదు. అప్పుడు కాస్తంత నవ్వి, తన తప్పు తెలుసు కున్నానన్న భర్త నటిస్తున్నాడని ఆమె అస్సలు గ్రహించ లేదు. కానీ శివకుమార్ మొగుడు, దుర్మా ర్గుడు.. వాష్రూమ్ వరకూ వెంట వెళుతున్నాడనే అనుకున్నారంతా.. అంతలోనే అంతా అయి పోయింది.
గొడవలు, మనస్పర్థలు భార్యాభర్తల మధ్య సహజం. ఒక్కోసారి ఇవి గోరంత నుంచి కొండంతకు వెళ్లి దారు ణాలకు దారి తీస్తుంటాయి. పోలీసులు, కోర్టుల జోక్యంతో భార్యాభర్తల మధ్య ఉండే విబేధాలు కొంతవరకు తగ్గొచ్చు. ఫ్యామిలీ కోర్టుకి చేరుకున్న కేసును సాధ్యమైంతవరకూ శిక్షవేయకుండా వారిద్దరినీ కలపడానికే చూస్తుంది కోర్టు. ఏదో కొన్ని సందర్భాల్లోనే తప్పనిస్థితిలో ఎవరో ఒకరికి శిక్ష వేయడం తప్పనిసరే అవుతోంది. ముందు అన్నింటికి అంగీకరించి ఆనక అత్తింటి ఆరళ్లు కొనసాగడం ఏ మహిళ కయినా దుర దృ ష్టమే. నాలుగ్గోడల మధ్య జరిగే హింసను కోర్టుకు ఈడ్చిందన్న ఆగ్రహం రెట్టించడమూ జరుగుతోంది. ఇలా చాలామంది సమస్యలు తీవ్రతరమై ఆత్మహత్యలూ చేసుకుం టున్నారు.
కానీ కర్ణాటక హస్సన్ జిల్లా ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన శివకుమార్, చిత్ర కేసు ఊహించనివిధంగా ఒక కొలిక్కి వచ్చింది. ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం నుంచి వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరు కుని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు. విడిపోవాలనే నిర్ణయించుకున్నారు. విడాకులే కావాలన్నారు. కానీ కోర్టువారు మాత్రం ఇద్దరికీ నచ్చజెప్పి ప్రశాంతంగా కాపురం చేసుకోవాలని సూచించారు. కోర్టు చెప్పిన మాటలు విన్నారు, తమ తప్పు తెలుసుకున్నట్టే కనిపించారు. ఇక నుంచీ కలిసే ఉంటా మన్నారు. శివ కుమార్ తన తప్పును తెలుసుకున్నాను, ఇక నుంచి చక్కగా కాపురం చేసుకుం టాననే అన్నాడు. అంత టితో కేసు ముగిసిపోయింది. ఇద్దరూ కోర్టు హాలు నుంచి బయటికి వచ్చారు. ఊహిం చని ట్విస్ట్ ఇక్కడ జరిగింది.
చిత్ర వాష్ రూంకి వెళ్తుండగా ఆమె వెనకాలే వెళ్లి కొడవలితో ఆమె గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులకు చిక్కాడు. రక్తపు మడుగులో ఉన్న చిత్ర ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయమై హస్సన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘‘కోర్టు పరిధిలోనే ఈ దారుణం జరిగింది. నిందితుడు మా కస్టడీలోనే ఉన్నాడు. దాడికి ఉపయోగించిన కొడవలిని సీజ్ చేశాం. ఈ కేసుపై తదుపరి విచారణ చేస్తున్నామని తెలి పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/husband-kills-wife-even-after-agrees-her-25-142165.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.