Publish Date:Jul 21, 2025
నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని కుబేరా సినిమా తరహాలో ఘరానా మోసానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు. ఇటీవల శేఖర కమ్ముల డైరక్షన్లో నాగార్జున, ధనుష్ ప్రధానపాత్రల్లో పాన్ ఇండియా మూవీగా కుబేరా విడుదలైంది. బిక్షగాళ్లని విదేశాలకు తీసుకెళ్లి పెద్దపెద్ద కంపెనీల యజమానులుగా మార్చేసి, వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలని బదిలీ చేయడం.. కుబేర సినిమా స్టోరీ. ఈ మూవీ రిలీజ్కు ముందే నెల్లూరు జిల్లాలో ఆ తరహా స్కాం చేసి చూపించారు క్రమినల్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి లోన్స్ ఇస్తామని చెప్పి వారి ఆధార్ కార్డులు సేకరించారు. వారిని అలా ఆధార్ కార్డులు సేకరించి ఆ గిరిజనులను సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా చూపించి.. వారి పేరు మీద రుణాలు తీసుకుని బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి.. గిరిజనులను ఉద్యోగులుగా చూపి.. కోట్లకు కోట్లు రుణాలు మంజూరు చేయించుకున్నారు. నెల్లూరుకి చెందిన ఐదుగురు ఈ స్కామ్ చేశారు. ఇందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా వుండటం గమనార్హం. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 8 నెలలు గడుస్తున్నా.. విచారణ ముందుకు కదల్లేదు.
తెలుగు రాష్టాలతో పాటు చెన్నై లో కూడా ఈ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్తో పాటు మరికొందరి పాత్ర ఉందని గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు లో జరిగిన స్కామ్ పై సీఐడీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని భారీ స్కాంకు పాల్పడ్డారు. రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల మేర అమాయకులకి టోకరా వేశారు.
రుణాలు చెల్లించాల్సిందిగా బ్యాంకుల నుంచి పేదలకి నోటీసులు రావడంతో ఈ బాగోతం బయటపడింది. ఈ మాఫియా కాజేసిన సొమ్ముతో సినిమాలు తీశారు. గతంలోనూ జర్నలిస్టు యూనియన్ పేరుతోనూ జాలే వాసుదేవనాయుడు భారీ మొత్తాలు వసూలు చేశాడు . గిరిజనుల పేరుతో స్కాంపై ఏడు నెలల క్రితం నెల్లూరు పోలీసులకి ఫిర్యాదులు చేసి గోప్యంగా ఉంచారు బ్యాంకు అధికారులు. 2021 నుంచి 2024 మధ్య ఈ వ్యవహారం భారీఎత్తున జరిగినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-scam-in-cinema-style-39-202375.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.