Publish Date:Apr 27, 2022
విజయసాయిరెడ్డి పని అయిపోయిందని అనుకుంటుండగా.. సడెన్గా పార్టీలో మళ్లీ నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చేశారు. సజ్జలను సైడ్ చేసేసి.. ఆయన స్థానంలోకి ఈయన వచ్చేశారు. వైసీపీ జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లంతా ఇక సాయిరెడ్డి ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుంది. ఇకపై సజ్జల జస్ట్ మీడియా, ఎమ్మెల్యేల సమన్వయకర్త మాత్రమే. ఏం జరిగింది? రాత్రికి రాత్రి తాడేపల్లి ప్యాలెస్లో ఈక్వెషన్ ఎందుకు మారిపోయిందని.. అంతా చర్చించుకుంటున్నారు. అసలు కారణం ఇదంటూ ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది.
బ్లాక్మెయిల్ చేసి మరీ విజయసాయిరెడ్డి కీలక పదవులు పట్టేశారని సమాచారం. అక్రమాస్తుల కేసులో జగన్తో పాటు ముద్దాయిగా ఉన్నారు విజయసాయి. ఆయనలానే ప్రస్తుతం బెయిల్పై బయట తిరుగుతున్నారు. పాత్రధారి జగనే అయినా.. సూత్రధారి విజయసాయినే అంటోంది సీబీఐ, ఈడీ. సాయిరెడ్డి ఐడియాల మేరకే సూటుకేసు కంపెనీలు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు తరలివచ్చాయని.. వేల కోట్ల క్విడ్ ప్రోకో నడిచిందని అంటున్నారు. ఆ కేసులు బలంగా ఉన్నా.. బెయిల్ మాత్రం వచ్చేసింది. ఆ అక్రమాస్తులకు సంబంధించిన గుట్టుముట్లన్నీ విజయసాయికి బాగా తెలుసు. తేడా వస్తే.. అప్రూవర్గా మారిపోతా.. తనకు కీలక పదవులు ఇవ్వాల్సిందేనంటూ.. జగన్రెడ్డి దగ్గర సాయిరెడ్డి పట్టుబట్టారని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు అంటున్నాయి.
ఇంకేమైనా ఉందా? విజయసాయి అప్రూవర్గా మారితే జగన్ కొంప మునగడం ఖాయమనే విషయం అందరికంటే ఆయనకే బాగా తెలుసు. అందుకే, అంత పని చేయమాకు.. కావలసింది పార్టీ పదవులేగా.. ఇదిగో తీసుకో.. అంటూ ఆ కీలక బాధ్యతలు సజ్జల నుంచి తీసేసి విజయసాయి చేతిలో పెట్టారట జగనన్న. అందుకే, రాత్రికి రాత్రే అలా పదవులు మారిపోయాయని అంటున్నారు. అదంతా, సాయిరెడ్డి బ్లాక్మెయిల్ ఫలితమే అని చెబుతున్నారు. ఎందుకైనా మంచిది.. జగన్తో జాగ్రత్తగా ఉండాలంటూ విజయసాయికి ఆయన సన్నిహితులు సలహా కూడా ఇస్తున్నారట వివేక ఘటనను గుర్తు చేస్తూ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/how-vijayasai-reddy-got-key-position-in-ycp-25-135092.html
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.