Publish Date:Jun 30, 2026
ఇండియన్ సిలికాన్ వ్యాలీ , గ్లోబల్ ఐటీ హబ్, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకే రోజు రాత్రి మూడు దారుణ హత్యలు జరగడం కలకలం రేపింది. లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఎటువంటి సమస్యా లేని, శాంతిభద్రతలకు నిలయంగా భావించే బెంగళూరు నగరంలో గంటల వ్యవధిలో మూడు వేర్వేరు చోట్ల ముగ్గురు హత్యకు గురి కావడం ఒక్కసారిగా ఐటీ నగరాన్ని వణికించేసింది. ఒకే రాత్రి ఇద్దరు మహిళలు, ఒక రౌడీషీటర్ దారుణ హత్యకు గురి కావడంతో బెంగళూరులో భద్రతపై టెక్కీలలోనే కాకుండా స్థానికులలో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.
వివరాలు ఇలా ఉన్నాయి.. బెంగళూరులో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్గా పేరుమోసిన హల్మక్ రాజా ను ప్రత్యర్థి ముఠా నడిరోడ్డుపై నడిరోడ్డుపై నరికి చంపారు. అదే రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఇరువురూ వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు ఇళ్లళ్లో ఒంటరిగా ఉన్న మహిళలే కావడం గమనార్హం.
ఒకే రాత్రి ఇలా వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు మహిళలు అమానుషంగా హత్యకు గురికావడం నగరంలోని మహిళల రక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ మహిళల హత్యల వెనుక ఉన్నది ఎవరు, అసలు హంతకులకు వీరితో ఉన్న విరోధం ఏంటి, లేదా ఇది దోపిడీ దొంగల పనా అనే కోణంలో పోలీసులకు ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని, త్వరలోనే ముగ్గురు హంతక ముఠాలను కటకటాల్లోకి నెడతామని పోలీసులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/horror-in-the-it-city-36-224575.html
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు మరింత జటిలంగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
రౌడీషీటర్ కేసు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు.
లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.
నెట్వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30, అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నాని పాత కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై అప్పట్లో నమోదైన కేసులో చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమయ్యారు.
2024 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాధవీలత.. ఇప్పుడు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు.
బస్సు అతి వేగంగా వెడుతుండటంతో.. ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.