పరకామణి కేసులో ప్రమేయమున్న పోలీసులకు షాక్

Publish Date:Jan 6, 2026

Advertisement

ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల దేవస్థానం పరకామణి కేసులో ఏపీ హైకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు మంగళవారం (జనవరి 6) హైకోర్టులో విచారణకు రాగా.. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది.

కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలివ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చోరీ కేసు మినహా సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి (జనవరి 8)వాయిదా వేసింది.

కాగా.. ఈ కేసులో అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌తో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించిన ఎస్‌ఐ లక్ష్మీ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ముగ్గురు పోలీసు అధికారులను పోలీస్ శాఖ వీఆర్‌కు పంపించింది. అయితే ఈ కేసుతో ప్రమేయం ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి కొన్ని పత్రాలను తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కుంటున్న వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

By
en-us Political News

  
రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు.
మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు
ఈ సంక్రాంతి సీజ‌న్లో కేవ‌లం రెండు రోజుల‌కే ఎన్ని వేల కోట్ల మేర కోళ్ల పందేలు జ‌రిగాయో చూస్తే ఆశ్చర్యపోతారు
ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.
142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
టీవ‌ల కాలంలో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పతనం అయ్యింది. దీంతో అక్కడ ఆహార ప‌దార్థాలు స‌హా అన్నిటి ధరలూ మింటికెగశాయి. దీనికి తోడు అమెరికా నుంచి యుద్ధ భ‌యం కూడా ఉండటంతో ఇరాన్ ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని ప‌నుల్లో నియ‌మించ‌రాద‌ని ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఇరాన్ లో ఆందోళనలను మిన్నంటాయి.
జగ్గన తోట తీర్థాన్ని జగ్గన్న తోట ప్రభల తీర్థంగా కూడా అంటారు. పచ్చని పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఎన్‌ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.