హీరోయిన్ సమంత కు సంబంధించి ఏ వార్త వచ్చినా అది సంచలనమే. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె సినీ కెరీర్ రేసు గుర్రంలా పరుగెడుతోందని చెప్పాలి. వరుస సినిమాలతో సందడి చేస్తున్న సమంత ఇప్పుడు రాజకీయాల వైపు దృష్టి సారించిందని అంటున్నారు.
ప్రస్తుతం ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సద్ధంగా ఉన్నాయి. యశోద, శాకుంతలం సినిమాలపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. సామాజిక మాధ్యమంలో యాక్టివ్ గా ఉండే సమంత గత కొన్ని రోజులుగా కొత్తగా ఎటువంటి పోస్టులూ చేయడం లేదు. కారణమేమిటా అని అభిమానులు పలు ఊహాగాన సభలు చేస్తున్నారు.
ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇంత బిజీలో కూడా రాజకీయాలవైపు దృష్టి సారించిందని అంటున్నారు. ఈ వార్తలకు కారణం ఆమె స్వయంగా తాను మేడీకి పెద్ద ఫాన్ నని చెప్పడమే కాకుండా ఆయనకు ఎప్పటికీ సపోర్టర్ గా ఉంటానని మీడియా ముందే చెప్పారు. దీంతో నెటిజన్లు ఆమె త్వరలో కమలం గూటికి చేరనున్నారని అంటున్నారు. పరిశీలకులు కూడా బీజేపీ పెద్దలు త్వరలో ఆమెను అప్రోచ్ అవుతారనీ, బీజేపీలోకి ఆహ్వానిస్తారని చెప్పారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ సినీ గ్లామర్ ను పార్టీలోనికి తీసుకురావడానికి అత్యంత ఉత్సాహం చూపుతున్న సంగతి విదితమే.
ఇటీవల అమిత్ షా హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నసంగతి విదితమే. జూనియర్ ఎన్టీఆర్ కమలం గూటికి చేరడంపై ఎన్నో వదంతులు ప్రచారంలోకి వచ్చినా అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. అయితే ఆ తరువాత సినీనటుడు నితిన్ ను బీజేపీ సంప్రదించింది. నితిన్ వచ్చే ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే మరి కొందరు సినీ నటులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే అనూహ్యంగా సమంత కమలం గూటికి చేరుతుందంటూ వార్తలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తనుండటం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. కెరీర్ పీక్ లో ఉండగా సమంత ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవని ఆమె అభిమానులు అంటుండగా.. కేరీర్, రాజకీయాలూ రెంటినీ సమన్వయం చేసుకోగలిగే సామర్థత సమంతలో మెండుగా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద సమంత బీజేపీ గూటికి చేరనున్నట్లుగా వస్తున్న వార్తలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. ఈ వార్త మాత్రం అటు సినీ వర్గాలలో, ఇటు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/heroine-samantha-to-join-bjp-25-143237.html
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.