మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల్లోనూ గొడవలు రేపుతోంది. టికెట్ కేటాయింపు విషయంలో, ప్రచారం విషయంలోనూ ఒక అవగాహనకు రావడంలో పార్టీలోనే విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇపుడు తాజా గా టిఆర్ ఎస్లోనూ విభేదాలు ముదిరి పాకాన పడింది.. భువనగిరి ఎంపీ, టీఆర్ఎస్ నేత మాజీ బూర నర్సయ్యగౌడ్ ఆగ్రహించారు. పార్టీ సంబంధించిన కార్యక్రమాల విషయాలు తనకు తెలియ నీయడం లేదని, మంత్రి జగదీశ్ రెడ్డి ఎలాంటి సమాచారం తెలియజేయకుండానే పార్టీకి దూరంచేసే పద్ధతిలో వ్యవహరి స్తున్నారని నర్సయ్య గౌడ్ ఆరోపించారు.
ఏకంగా మంత్రి జగదీశ్రెడ్డికి కామన్సెన్స్ లేదా అంటూ కోపగించుకున్నారు. నల్లగొండజిల్లా మునుగోడు లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీసీలు అధికంగా ఉన్న మునుగోడులో క్రియాశీలనేతగా చాలా కాలం నుంచి మాజీ ఎంపీగానూ ప్రాతినిధ్యం చేస్తున్న తనకు పార్టీ టికెట్ అడిగే హక్కులేదా అని ప్రశ్నించారు.
పార్టీలో దేనికయినా తుది నిర్ణయం అధినేత కేసీఆర్దే కానీ ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకంగా ఉందన్నారు. తనను పార్టీ కార్యక్రమాలకు పనిగట్టుకుని దూరంగా పెడుతుండటా నికి కారణమేమిటని ప్రశ్నించారు. తననే కాదు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పట్ల కూడా మంత్రి తీరు అన్యాయంగా ఉందని ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇటీవల మునుగోడులో జరిగిన సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను కూడా ఆయనే చూశారు. జన సమీకరణ విషయం లో సీనియర్ నేతలు బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ ను మంత్రి కనీసం పట్టించుకోలేదని అప్పుడే విమర్శలు వచ్చాయి.
టీఆర్ఎ్సలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్దే తుది నిర్ణయమని, అయితే మంత్రి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారని చెప్పారు. టీఆర్ఎ్సలో క్రియాశీలనేతగా, ఈ ప్రాంత మాజీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన తనకు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని అడగడం తప్పేంటని, పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం ఏమి టని ఆయన ప్రశ్నించారు. తనతోపాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పట్ల కూడా మంత్రి అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఉపఎన్నికలో గెలిచే అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపినా తాను పనిచేస్తానన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడతానని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/differences-between-bura-25-143235.html
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.