వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం!

Publish Date:Dec 6, 2025

Advertisement

వారసత్వ ఆస్తులు, ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళతరం, సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇకపై ఈ రిజిస్ట్రేషన్లు గ్రామ, వార్డు సెక్రటేరియెట్లలో నే చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తల రిజిస్ట్రేషన్ ఫీజును వంద రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వారసత్వ ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయడం వల్ల దాదాపు 3,9 లక్షల మంది భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు.

భూయజమాని మరణం తర్వాత కుటుంబసభ్యులు ఆ ఆస్తులను తమ పేర్లపై బదలాయించుకోవడానికి రకరకాల కారణాల వల్ల ఆలస్యం అవ్వడమే కాకుండా,  డాక్యుమెంట్లు.. ఫ్యామిలీ సర్టిఫికెట్ల సమస్యలతో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఈ కారణంగా భూవివాదాలు పెచ్చరిల్లు తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.  

ఈ కొత్త విధానంలో డెత్,  లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు,  ఆధార్, ఆస్తి డాక్యుమెంట్లు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్  సమర్పిస్తే.. డిజిటల్ అసిస్టెంట్ వాటిని వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక మ్యూటేషన్ కూడా ఆటోమేటిగ్గా అయిపోయి, పాస్ బుక్  జారీ అవుతుంది. వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. మ్యూటేషన్ ఆటోమేటిక్‌గా జరిగి, ఈ-పాస్‌బుక్ జారీ అవుతుంది. గతంలో అయితే.. వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఎమ్మార్వో లేదా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది, అక్కడ ప్లెయిన్ పేపర్‌లో వివరాలు సమర్పించి కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ కొత్త సరళీకరించిన విధానంతో  స్థానిక సెక్రటేరియట్లలోనే ఈ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది.  

By
en-us Political News

  
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు.
గోవా నైట్ క్లబ్‌‌ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ డా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండిగోలో అస‌లు స‌మ‌స్య ఏంటి అని చూస్తే కొత్త పైల‌ట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల‌ను మంత్రి పొంగులేటి శనివారం పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది.
తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన థరూర్‌ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది.
క్రికెట్ అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ లోగా కొందరు గోడలు దూకి, చెట్లు ఎక్కి మైదానంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నంలో గాయపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.